ప్రస్తుతం మళ్లీ విడత పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ లపై ఢిల్లీ పోలీసులు చేయి చేసుకున్నారు.
అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రావడంతో వైరల్ గా మారింది.విషయంలోకి వెళితే త్వరలో కేరళ రాష్ట్రంలో స్టార్ట్ కానున్న కేరైల్ ప్రాజెక్టు ప్రారంభం కానున్న తరుణంలో దానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనకు దిగిన కాంగ్రెస్ ఎంపీలపై.
ఢిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు.
ఏకంగా పార్లమెంట్ సభ్యుల పై పోలీసులు చేయి చేసుకోవడంతో ఈ వీడియో ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
కేరళ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ హిబి ఇడెన్ పై పోలీసులు చేసుకోవడం జరిగింది.పార్లమెంట్ సమీపంగా ఉన్న విజయ్ చౌక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఢిల్లీ పోలీసులు ఈ రీతిగా ఎంపీలపై చేయి చేసుకోవటం సంచలనంగా మారింది.ఆందోళన చేపట్టిన ఎంపీలు …పోలీసులు మధ్య తోపులాట జరిగిన క్రమంలో హిబీ ఇడెన్ చెంప చెల్లుమనేలా ఢిల్లీ పోలీసులు కొట్టడంతో ఆ విజువల్.
సోషల్ మీడియాలో రావటంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.