ఢిల్లీలో అర్ధరాత్రి వణుకు పుట్టించే మిస్టరీ ఘటన... ఏం జరిగిందంటే..?

దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలకు వణుకు పుట్టించే మిస్టరీ ఘటన చోటు చేసుకుంది.ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో వింత అరుపులు వినిపించటంతో భయాందోళనకు గురయ్యారు.

 People Afraid About Money Man In Delhi State-TeluguStop.com

సగం కోతి సగం మనిషిలా ఉన్న ఆకారం ఢిల్లీ ప్రజలను భయపెట్టింది.ఆ ఆకారం కొంతమంది ప్రజలపై వేగంగా దాడి చేసి అక్కడినుండి మాయమైనట్లు సమాచారం.

ఈ ఘటన చోటు చేసుకున్న మరుసటి రోజు కూడా అలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో ప్రజలు టెన్షన్ పడుతున్నారు.

కొందరు ప్రజలు ఆ వింత ఆకారాన్ని పట్టుకోవాలని ప్రయత్నాలు చేసినా వారికి ఆ ఆకారం చిక్కలేదు.

కొందరు స్థానికులు సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన గురించి ఫిర్యాదు చేశారు.కానీ పోలీసులు మాత్రం కోతులు, కొండముచ్చులు దాడి చేసి ఉంటాయని భావిస్తున్నారు.

ఆ వింత ఆకారాన్ని చూసిన ప్రజలు మాత్రం తలకు హెల్మెట్ తో మనిషి రూపంలో ఉన్న ఆకారం తమపై దాడి చేసిందని చెబుతున్నారు./br>

ఢిల్లీ ప్రజలు ఈ ఘటనతో భయాందోళనకు గురయ్యారు.

దాదాపు 20 మంది ఐదు రోజుల వ్యవధిలో గాయాలపాలయినట్లు సమాచారం.ప్రజలు ఈ వింత ఆకారానికి మంకీ మ్యాన్, బందర్ అని పేర్లు పెట్టారు.

పోలీసులు ఈ ఘటనల గురించి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.మంకీ మ్యాన్ పేరు చెప్పుకొని ప్రజలు కథలు అల్లుతున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి.

ఢిల్లీ ప్రజలు మాత్రం మంకీ మ్యాన్ పేరు వినపడితే చాలు భయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube