కళ్యాణ్ రామ్ మొదటి సారి వేరే హీరోతో నిర్మించిన చిత్రం ‘కిక్ 2’.రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు అనేక ఇబ్బందులు ఎదురయిన విషయం తెల్సిందే.
ఆర్థిక సమస్యల వల్ల కళ్యాణ్ రామ్ ఆ చిత్రాన్ని విడుదల చేయలేక పోవడంతో ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ‘కిక్ 2’ చిత్రాన్ని విడుదల చేసేందుకు కావాల్సిన ఫార్మాల్టీస్ను పూర్తి చేసినట్లుగా మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.తాజాగా ఆ వార్తలపై ఎన్టీఆర్ ‘షేర్’ ఆడియో విడుదల కార్యక్రమంలో స్పందించాడు.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మల్లికార్జున దర్శకత్వంలో తెరకెక్కిన ‘షేర్’ ఆడియో నిన్న వైభవంగా జరిగింది.ఈ వేడుకలో పాల్గొన్న ఎన్టీఆర్ ‘కిక్ 2’ కథనాలపై స్పందించాడు.
తాను ‘నాన్నకు ప్రేమతో’ షూటింగ్ నుండి బ్రేక్ తీసుకుని లండన్ నుండి హైదరాబాద్ వస్తే ఏవో పుకార్లు వచ్చాయి.కళ్యాణ్ రామ్ను ఆదుకునేందుకు వచ్చాడని, ఏవో సంతకాలు చేసేందుకు కళ్యాణ్ రామ్ వచ్చాడని ఏవో పుకార్లు పుట్టుకు వచ్చాయి.
అన్న కళ్యాణ్ రామ్ చేయి ఎప్పుడు పైనే ఉంటుంది.అలాంటి అర్థంపర్థం లేని పుకార్లను మరోసారి ప్రచారం చేయకండి అంటూ ఎన్టీఆర్ మీడియాను కోరాడు.