హమ్మయ్య ఎట్టకేలకు చంద్రబాబు తనయుడు లోకేష్ ఇల్లు వదిలి బయటకు వచ్చారు అంటూ టీడీపీ నేతలు ఎక్కడలేని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి వరకు హైదరాబాద్ లోని తన నివాసానికే లోకేష్ పరిమితమై పోవడంతో, టిడిపి రాజకీయ ప్రత్యర్థులను లోకేష్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు గుప్పించారు.70 ఏళ్ల వయసు దాటినా చంద్రబాబు హైదరాబాద్ నుంచే జూమ్ యాప్ ద్వారా ఏపీ ప్రభుత్వంపై ఏదో ఒకరకంగా విమర్శలు చేస్తూనే వస్తున్నారు.ప్రస్తుత పరిణామాలతో తాను హైదరాబాద్ లోనే మకాం వేసి ఉంటే, ఏపీలో పార్టీ పరిస్థితి గతం కంటే మరింత గా దెబ్బ తింటుందని భావించిన చంద్రబాబు రిస్క్ చేసి మరి ఏపీలో అడుగుపెట్టారు.
అయితే పార్టీ నేతలెవరూ నేరుగా ఆయనను కలవకుండా హైదరాబాదులో ఏ విధంగా అయితే, జూమ్ యాప్ ద్వారా మాట్లాడుతున్నారు.
ఆయనను కలిసేందుకు పార్టీ నాయకులు ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నా చంద్రబాబు ఎవరినీ కలిసేందుకు ఇష్టపడడం లేదు.ప్రస్తుతం అమరావతి ఉద్యమం 300 రోజులు పూర్తయిన సందర్భంగా లోకేష్ అమరావతి పరిసర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో పర్యటించారు. అమరావతి కోసం ఉద్యమాలు చేస్తున్న వారిని కలిసి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా అమరావతి ప్రాంతంలో ఉన్న కురగల్లు , దొండపాడు, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణయ్య పాలెం తుళ్లూరు అనంతవరం ఇలా కొన్ని గ్రామాల్లో పర్యటించారు.లోకేష్ పర్యటన సందర్భంగా పార్టీ నాయకుల్లోనూ కదలిక వచ్చినట్టు కనిపించింది.
అయితే లోకేష్ ఇప్పుడు చురుగ్గా ఎలా అయితే కార్యక్రమాల్లో పాల్గొన్నాడో అంతకు ముందు కూడా పర్యటన చేసి ఉంటే, ఆయనపై ఎటువంటి విమర్శలు వచ్చే ఉండేవి కాదని, చంద్రబాబు హైదరాబాద్ వచ్చి పార్టీ నాయకులను ఉత్సాహపరిచే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా, లోకేష్ మాత్రం ఇవేమీ పట్టినట్టు గా వ్యవహరించే వారిని, దాని కారణంగానే ఆయన పార్టీ నాయకులు , ప్రతిపక్షాలు చేసిన విమర్శల కారణంగా, ఇప్పుడు పర్యటించి నట్టుగానే కొంత ముందుగా మేల్కొని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, అనవసర తిట్లు తప్పేవి అనే సానుభూతిని పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.