రూ.17 లక్షల సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మేల్యే

నల్లగొండ జిల్లా: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్ అన్నారు.శనివారం నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో వివిధ అనారోగ్య కారణాలతో ప్రైవేట్ హాస్పటల్లో చికిత్స పొందిన పేద కుటుంబాల వారికి రూ.

17 లక్షల సిఎం సహాయనిధి చెక్కులు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పేద వాళ్లకు చేయూతనిచ్చేందుకు సీఎం సహాయనిధి అనేది ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందన్నారు.

ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి,మండల అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్,వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఆడెపు సతీష్,నారాయణ తదితరులు పాల్గొన్నారు.

శిధిలావస్థకు చేరిన పెద్దవూర దవాఖానా...!
Advertisement

Latest Nalgonda News