మరాఠిలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాను తెలుగులో గ్రాండ్ గా రీమేక్ చేస్తున్నారు క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ.ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలుగా నటిస్తున్న రంగమార్తాండ సినిమాలో అనసూయ, అలి రెజా, రాహుల్ సిప్లిగంజ్, బ్రహ్మానందం నటిస్తున్నారు.
చాలారోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ రాలేదు.లేటెస్ట్ గా రంగమార్తాండ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఈమధ్య చిన్న సినిమాలన్ని ఓటీటీ బాట పడుతున్నాయి.
థియేట్రికల్ రిలీజ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ లు ఉంటాయి.కాని ఓటీటీ రిలీజ్ లో ప్రాఫిట్ మాత్రమే ఉంటుంది.
లాభం తక్కువే అయినా నిర్మాత సేఫ్ అన్నట్టే.డైరక్టర్ గా కెరియర్ లో వెనకపడ్డ కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాతో సత్తా చాటుతాడా లేదా అన్నది చూడాలి.
కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నా డైరక్టర్ గా కృష్ణవంశీ తన మార్క్ చూపించలేకపోతున్నాడు.అందుకే కృష్ణవంశీ రంగమార్తాండ మీద పూర్తి ఫోకస్ పెట్టాడు.
ఈ సినిమాతో మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. సినిమాలో చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు నటిస్తున్నారు కాబట్టి.
రంగమార్తాండ ఆశించిన స్థాయిలో ఉంటుందని అంటున్నాయి సినీ వర్గాలు.