సీపీఐ నేత జేఎన్.యూ మాజీ అధ్యక్షుడు ఫైర్ బ్రాండ్ నాయకుడు కన్నయ్య కుమార్ >కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
రాహుల్ గాంధీ సమక్షంలో జాయిన్ అయిన కన్నయ్య కుమార్ బిజెపిని ఎదుర్కోవటానికి.కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లు స్పష్టం చేశారు.
కన్నయ్య కుమార్ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు సీపీఐ పార్టీలో చేరారు.బీహార్ లో తన హోమ్ టౌన్ నుండి పోటీ చేసి బీజేపీ చేతిలో ఓడిపోయారు.
బ్రిటిష్ వారికి సెల్యూట్ చేస్తున్న వారు ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్నారు అని, మతతత్వ శక్తులను ఎదుర్కోటానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లు చెప్పుకొచ్చారు.
![Telugu Congress, Cpm, Kannayya Kumar, Rahul Gandhi-Telugu Political News Telugu Congress, Cpm, Kannayya Kumar, Rahul Gandhi-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2021/09/Kannayya-Kumar-joins-Congress-party-Kannayya-Kumar-Congress-partylatets.jpg)
కాంగ్రెస్ పార్టీ ని కాపాడుకోకపోతే దేశం విచ్ఛిన్నం అయిపోతుంది అని.కన్నయ్య కుమార్ అన్నారు.ఈ క్రమంలో రాహుల్ గాంధీ… కన్నయ్య కుమార్ రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు.
మరోపక్క కన్నయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం పట్ల బీజేపీ అదేవిధంగా సీపీఐ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద.
బలమే అని అంటున్నారు.కన్నయ్య కుమార్ మంచి వాక్చాతుర్యం కలిగిన.
యువనేత కావడంతో.కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు కూడా.
కన్నయ్య కాంగ్రెస్ లోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.