చాలామందికి జ్యోతిష్యం చెప్పించుకునే అలవాటు ఉంటుంది.భవిష్యత్తులో తాము ఏమవుతారో అన్నట్లు తమ గురించి తాము జ్యోతిష్యం చెప్పించుకుంటారు.
మరికొంతమందికి జ్యోతిష్యం అంటే నచ్చదు.అవన్నీ అబద్ధాలు అంటూ పట్టించుకోరు.
కానీ కానీ అవి నిజ జీవితంలో ఎదురైతే ఓ సమయాన నమ్మాల్సి వస్తోంది.కాగా ఇద్దరూ ప్రపంచ జ్యోతిష్యులు మన దేశాన్ని నెంబర్ వన్ చేశారు.
చేయి చూసి చూడగానే భవిష్యత్ మొత్తం చెప్పేస్తున్నాడు ఓ జ్యోతిష్యుడు.అతని పేరు విలియం జాన్ వార్నర్.ఇతనికి చాలా పేర్లు ఉన్నాయి.కాగా అతనిని “కీరో” అని పిలుస్తారు.
ఐర్లాండ్ లో పుట్టిన ఇతను ప్రపంచ వ్యాప్తంగా అద్భుత జ్యోతిష్యుడు.చేయి చూసి జరగబోయేది మొత్తం ఇట్టాగే చెప్పేస్తాడు.
అంతేకాకుండా టైటానిక్ షిప్ మునిగిపోతుందని కూడా ఈయన ముందే తెలిపాడు.చాలా మంది గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తుల భవిష్యత్తు గురించి చెప్పగా అవన్నీ నిజమయ్యాయి.
నేరుగా చేతిని చూసే కాకుండా వాటి ప్రింటర్ ద్వారా కూడా జాతకం చెప్పేస్తాడు.కాగా కీరో జ్యోతిష్య గురువు ఎవరో కాదు.
ఆయన మన దేశస్థుడే.ఆయన నుంచే చేయి జ్యోతిషాన్ని నేర్చుకున్నానని కొన్ని పుస్తకాల్లో తెలిపాడు కీరో.
అంతే కాకుండా మరో స్త్రీ.ఆమె ప్రపంచ జ్యోతిష్యరాలు.ఆమె పేరు “లిండా”.ఈమె పుట్టిన తేదీ ద్వారా భవిష్యత్తు గురించి తెలియజేస్తుంది.అంతేకాకుండా అభిరుచుల గురించి, ఇష్టాయిష్టాలు గురించి ఉన్నది ఉన్నట్టుగా తెలుపుతుంది.ఈమె భారతదేశంలో హిమాలయాలలో ఈ విద్యలు నేర్చుకుంది.
ఆమె ఎన్నో పుస్తకాలు రాసింది.అన్ని విషయాలు ఇట్టాగే చెప్పేస్తుంది.
తను చెప్పే జ్యోతిష్యం లో.ఏ ఒక్క విషయం కూడా తప్పుగా ఉండదు.ఆమె చాలా వరకు తన ప్రయోగాత్మకంగా ఎన్నో ఆలోచనలు చేసి ఎంతమందికి ఎన్నో విషయాలను తెలిపింది.కాగా వీళ్ళిద్దరూ మనదేశంలో విద్యలను నేర్చుకొని మన దేశానికి మంచి గుర్తింపును తీసుకొచ్చి అద్భుతమైన జ్యోతిష్యులు గా నిలిచారు.