కొంతమందికి దైవభక్తి బాగా ఎక్కువగా ఉంటుంది.రోజూ గుడికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు.
అలాగే వత్రాలు, హోమాలు లాంటికి కూడా చేస్తూ ఉంటారు.నిత్యం దేవుడిని స్మరించుకుంటూ భగవంతుడి సేవలో గడుపుతారు.
దేవుడిపై ఉన్న భక్తితో హుండీలె డబ్బులు వేసి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.అలాగే దేవాలయాలకు( temples ) పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ దైవభక్తిని చాటుకుంటారు.
మరికొంతమంది అయితే తమ సొంత డబ్బులతో దేవాలయాలను నిర్మిస్తూ ఉంటారు.తాజాగా అలాంటి ఒక ఘటన ఒకటి చోటుచేసుకుంది.
ఇండియాలో వీధివీధికి ఒక దేవాలయం ఉంటుంది.ప్రతీ వీధిలోనూ ఏదోక దేవుడికి సంబంధించిన దేవాలయం తప్పనిసరిగా ఉంటుంది.ఇక అమెరికాలో( America ) అయితే హిందూ దేవాలయాలు తక్కువగా ఉంటాయి.కానీ హిందూవుల కోసం ఒక దేవాలయం కట్టేందుకు కొంతమంది భారతీయులు విరాళం వేసుకుని కాలిఫోర్నియాలో( California ) ఒక దేవాలయం నిర్మించారు.వాటితో పాటు బ్యాంకు నుంచి లోన్ కూడా తీసుకుని దేవాలయం కట్టించారు.1974లో ఉత్తర కాలిఫోర్నియాలో దేవాలయం నిర్మించాలని కొంతమంది భారతీయులందరూ కలిసి నిర్ణయించుకున్నారు.1977లో అందరూ కలిసి నాలుగెకరాల స్థలాన్ని కూడా ఒకచోట కొనుగోలు చేశారు.
స్థలాన్ని కొనుగోలు చేసేందుకు గుజరాత్కు చెందిన అద్వాణి ( Advani )అనే భక్తుడు రూ.4.50 లక్షలు విరాళంగా ఇచ్చాడు.ఇలా అందరూ వివరాలు వేసుకుని దేవాలయం నిర్మాణం ప్రారంభించగా.స్థానిక పాలనా సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది.దీంతో రెండేళ్లపాటు నిరసనలు తెలిపారు.ఆ తర్వాత 20 మంది తమ ఇళ్లను తాకట్టుగా పెట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( State Bank of India )నుంచి రూ.60 లక్షలు విరాళంగా తీసుకున్నారు.ఈ డబ్బులతో వేరే ప్రాంతంలో వెంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించారు.
ఈ దేవాలయంలో ఇప్పటికీ రోజూ పూజలతో పాటు ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.