అదృష్టం అనేది అంత సులువుగా ఎవరిని వరించదు, ఒక వేళ వరించిందంటే లైఫ్ సెట్ అయ్యిపోవాల్సిందే.అయితే ఈ అదృష్టం ఎన్నో రూపాలలో వస్తుంది కానీ మనకి మనం మన అదృష్టాన్ని పరీక్షించుకునేది ఎక్కువగా లాటరీ టిక్కెట్ల రూపంలోనే.
కానీ లాటరీ టిక్కెట్లలో అదృష్టం రావడం అనేది నూటికో కోటికో ఒకరికి తగులుతుంది.కానీ పట్టు వదలకుండా ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా ఎదో ఒక రోజు లాటరీలలో భంపర్ తగులుతుందని భావించి అదే పనిగా ప్రయత్నించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు.
తాజాగా దుబాయ్ లో ఇలాంటి అదృష్టమే భారతీయుడిని వరించింది. అతడు కలలో కూడా ఊహించనంత డబ్బు వచ్చి పడింది.
వివరాలలోకి వెళ్తే.
భారత్ లోని కోచిన్ కి చెందిన కోసీ వర్గీస్ అనే వ్యక్తి ఎన్నో ఏళ్ళ క్రితమే దుబాయ్ వెళ్ళాడు.
అక్కడ భారతీయులు ఎక్కువగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ కొనుగోలు చేస్తుంటారని తెలుసుకుని తాను కూడా అదృష్టాన్ని పరీక్షుంచుకోవాలని భావించాడు.ఈ క్రమంలోనే క్రమం తప్పకుండా కొందరి సూచనల మేరకు లాటరీ టిక్కెట్లు గడిచిన కొన్నేళ్లుగా కొనుగోలు చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు.
ఎట్టకేలకు ఎన్నో ప్రయత్నాల తరువాత తాజాగా అతడు కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్టుకు అదృష్టం వరించింది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.8 కోట్లు గెలుచుకున్నాడు వర్గీస్.కొన్ని రోజుల క్రితం దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ నిర్వాహకులు దుబాయ్ ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్ట్ లో లక్కీ డ్రా తీసారు.
ఈ డ్రా సమయంలో వర్గీస్ అక్కడే ఉన్నాడు.నిర్వాహకులు టిక్కెట్టు నెంబర్ చదువుతుండగా అతడి ఆశలకు ఒక్కసారిగా ఊపిరి అందుకుంది, అతడు కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్టు నెంబర్ 0844 కు భారీ మొత్తంలో డబ్బు తగలడంతో ఉబ్బితబ్బిబ్బై పోయాడు.
అంతేకాదు లాటరీ నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్తూ సంతోషం వ్యక్తం చేశాడు.దుబాయ్ వచ్చిన నాటి నుంచీ తాను లాటరీ టిక్కెట్ల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నానని ఇన్నేళ్ళకు తనను అదృష్టం వరించిందని చెప్పుకొచ్చాడు.