మనసులో కోరుకునే ప్రతి ఒక్క కోరిక కోరాలని చాలామంది దేవాలయాలకు వెళ్తూ ఉంటారు.అదేవిధంగా చాలామంది దేవుడికి హుండీలో లక్షలు లక్షలు మనసులో ఉన్న కోరికలు కోరాలని లంచం రూపంలో వేస్తూ ఉంటారు.
అలాగే ఆ కోరిక నెరవేరాలంటే ఎన్నో పూజలు, నియమాలు పాటిస్తూ ఉంటారు.నిజానికి ఇలా చేయడం వలన ఆ దేవుడు కరుణిస్తాడా? మీరు అడిగిన ప్రతి వరాలను సమకూరుస్తాడా? మరి అయితే మనం దాని కోసం ఏం చేయాలి? ఇలా లక్షలు హుండీలో ( Hundi )వేసే కన్నా దేవాలయాలలో ఏం సమర్పిస్తే మనకు ఎలాంటి పుణ్యం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
![Telugu Bhakti, Devotional, Groin, Hundi, Pearls-Latest News - Telugu Telugu Bhakti, Devotional, Groin, Hundi, Pearls-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/12/If-you-put-lakhs-in-a-hundi-and-offer-them-in-a-temple-how-much-merit-is-ita.jpg)
మానవులకు కోరికలు ఉండడం సహజమే.కలియుగంలో మానవులకు కోరికలు తీరేందుకు దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తుంటారు.ఈ మొక్కులు అనేక రూపాలుగా ఉంటాయి.అయితే ధనం, ధాన్యం, వస్తువు, రూపేనా ఉంటాయి.కొంతమంది దేవాలయాల్లో ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు వేస్తూ ఉంటారు.అయితే నిజానికి హుండీలో కానుకలు వేయాలని లేదా హుండీలో డబ్బులు వేయమని మన పురాణాల్లో ఎక్కడ కూడా చెప్పలేదు.
ఎప్పటికైనా కూడా దానధర్మాలే చేయాలని చెప్పారు.మన దేవాలయంలో ఏం సమర్పిస్తే, ఏం పుణ్యం లభిస్తుందో విష్ణు ధర్మోత్తర పురాణం( Vishnu Dharmottara Purana ) తృతీయ ఖండం 341 వ అధ్యాయం మనకు వివరిస్తుంది.
అయితే దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ దానికి నిర్మాణ వ్యవహారాలకు అందరూ సహకరిస్తేనే అది చక్కగా నిర్మాణం సంతరించుకుంటుంది.
![Telugu Bhakti, Devotional, Groin, Hundi, Pearls-Latest News - Telugu Telugu Bhakti, Devotional, Groin, Hundi, Pearls-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/12/If-you-put-lakhs-in-a-hundi-and-offer-them-in-a-temple-how-much-merit-is-itc.jpg)
అందుకే ఎవరు చేతనైన అంతలో వారు సమర్పించుకోవాలి.ముందుగా దేవాలయాలకు సహాయ సహకారాలు అందించాలని పురాణాలు చెబుతున్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దేవాలయ గోడలకు సున్నం( paint for temple walls ) వేయడం లాంటివి, అలాగే ప్రాంగణంలో ముగ్గులు వేసి దేవాలయానికి కొత్త శోభ చేకూర్చడం లాంటివి చేయడం వలన పుణ్యం పొందుతారు.అంతేకాకుండా ఆలయానికి శంఖం లాంటివి దానం చేయడం వలన విష్ణువు పుణ్యలోక ప్రాప్తి కలుగజేస్తాడు.
ఆ తర్వాత మానవ జన్మ ఎత్తాల్సి వచ్చినా కూడా కీర్తివంతులుగానే పుడతారు.దానం చేస్తే మహా గొప్ప కీర్తిమంతుడు అవుతారు.అంతేకాకుండా గజ్జలను, మువ్వలను( Groin , pearls ) దానం చేయడం వలన కూడా సౌభాగ్యవంతులవుతారు.ఆలయ ప్రాంగణంలో చల్లదనం కోసం పందిర్లు నిర్మిస్తే, కీర్తి పొందడానికి ధర్మబుద్ధి కలవడానికి కారణం అవుతారు.
LATEST NEWS - TELUGU