దేశ రాజధాని ఢిల్లీ ఒక పక్క రైతులు ఆందోళనలు మరియు నిరసనలతో దద్దరిల్లుతున్న తరుణం లో భూకంపం రావడం ఒక్కసారిగా నగరవాసులను భయబ్రాంతులకు గురి చేసింది.గత కొంత కాలం నుండి ఉత్తరభారతదేశంలో భూకంపాలు సంభవించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఢిల్లీలో గురువారం భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.ఢిల్లీలో స్వల్పంగా భూమి కంపించింది.దీంతో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.8గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది.సరిగ్గా ఉదయం 9 గంటలు దాటిన తర్వాత పశ్చిమ ఢిల్లీలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.దాదాపు 15 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది.
అంతకు ముందే ఒకసారి భూమి కన్పించడంతో మళ్లీ మరోసారి భూప్రకంపనలు రావడంతో దేశ రాజధాని వాసులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు.