హిందూ సనాతన ధర్మం( Hindu orthodoxy ) ప్రకారం ఆహారం లేదా భోజనానికి సంబంధించిన నియమాల గురించి చాలా విషయాలు పురాతన గ్రంధాలలో ఉన్నాయి.మీరు ఆహారం తినే ముందు మంత్రాలు పఠించడం, ఆ తర్వాత ప్లేట్ చుట్టూ నీరు చల్లడం చూస్తూనే ఉంటారు.
ఇలా చాలామంది ప్రజలు అనుసరిస్తూ ఉంటారు.తినే ముందు ప్లేట్ చుట్టూ నీళ్లు చల్లాలి అని గ్రంధాలలో ఉంది.
కానీ ఇలా ఎందుకు చేస్తారని ఎప్పుడైనా ఆలోచించారా.దీనికి కూడా మతపరమైన కారణం మాత్రమే కాదు శాస్త్రీయ( Scientific ) కారణం కూడా ఉంది.
ఆ కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే పళ్లెం చుట్టూ నీళ్లు చల్లడం పూర్వకాలం నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం.ఇప్పటి కాలంలో కూడా కొందరు ఇలా చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.మనం ఇలా చేస్తున్నప్పుడు మనం తినే ప్రదేశంలో ప్రతికూలత ప్రవేశించకుండా ప్లేట్ చుట్టూ నీటి రేఖ ఏర్పడుతుంది.
ఇంకా చెప్పాలంటే మరో కారణం కూడా ఉంది.తినడానికి ముందు ప్లేట్ చుట్టూ నీళ్లు చల్లడం అన్నపూర్ణాదేవికి ( Annapurna Devi )మన ఇష్ట దైవానికి మనం గౌరవం చూపినట్లు అర్థం చేసుకోవచ్చు.
దీనికి మతపరమైన కారణంతో పాటు శాస్త్రీయ కారణం కూడా ఉంది.పూర్వకాలంలో అందరూ నేలపై కూర్చుని తినేవారు.
ప్లేట్ నుండి కీటకాలను దూరంగా ఉంచడానికి లేదా డిన్నర్ ప్లేట్ లోనికి ప్రవేశించకుండా నిరోధించడానికి ప్లేట్ చుట్టూ నీరు చల్లేవారు.పూర్వం రోజులలో ఇంట్లో మట్టిని నేల ఉండేది.అటువంటి పరిస్థితిలో నీటిని చల్లడం మట్టిని తేమ చేస్తుంది.అలాంటప్పుడు నేల గాలిలోకి ఎగరడానికి సహకరించదు.ఇది మన ప్లేట్లోని ఆహారాన్ని శుభ్రంగా ఉంచుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే నేటి ఆధునిక ప్రపంచంలో నేలపై కూర్చొని భోజనం( meal ) చేసే విధానానికి చాలామంది స్వస్తి పలుకుతున్నారు.
ప్రజలు మంచం మీద కూర్చుని ఆహారం తింటున్నారు.మంచం మీదను కూర్చొని టీ తాగుతూ, భోజనం చేస్తున్నారు.
మంచం మీద కూర్చుని అసలు తినకూడదనీ శాస్త్రాలు చెబుతున్నాయి.దీని వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
దానివల్ల మీరు పేదరిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
DEVOTIONAL