తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రతి హిందువు తహతహలాడుతారు.ఎన్నో వ్యయ ప్రయాసలతో స్వామివారి దర్శనం చేసుకుని హమ్మయ్య అంటూ నిట్టూరుస్తారు.
స్వామి వారి దర్శన భాగ్యం కలిగిందని ఎక్కడలేని ఆనందం వెళ్లబుచ్చుతం.ఎన్ని కష్టనష్టాల కోర్చి స్వామి దర్శనం చేసుకున్నా.
ఆలయం నుంచి వెలుపలకు రావడం ఆలస్యం.ఆ రూపాన్ని మర్చిపోతాం.ఎందుకిలా? దీనికి సంబంధించిన కారణాలు తెలుసుకోవాలంటే వేల సంవత్సరాల కిందట జరిగిన ఓ సంగతి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే.

కొన్ని వేల ఏళ్ల కిందట శ్రీవారి ఆలయ ఆవరణలో జరిగిన ఘటన గురించి తెలుసుకుంటే అసలు విషయం అర్థమవుతుంది.దేవతలు, మహర్షులు కలిసి తిరుమల ప్రధాన ఆలయం ఆవరణలో పరివార దేవతల విగ్రహాలను ప్రతిష్టించారు.ఇప్పటికీ వారు సజీవంగానే ఉన్నారని నమ్ముతారు.
ఆలయానికి రక్షణ కవచంగా వీళ్లే ఉంటారు.కాని సామాన్య మానవులకు వారి దర్శనం కలగదు.
అసలు ఆ శక్తిని తట్టుకోలేరు కూడా.ఆలయం నుంచి బయటకు రాగానే వీరి ప్రభావంతో స్వామివారి రూపం మది నుంచి దూరమవుతుంది.
మళ్లీ గుర్తుచేసుకోవాలనుకున్నా సాధ్యం కాదు.అందుకే చాలామంది వీలైనన్ని ఎక్కువసార్లు స్వామివారిని దర్శించుకోవడానికి పదే పదే తిరుమలకు వెళ్తుంటారు.
ఇదంతా శ్రీవారి లీలే.