ప్రైవేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇకపై ఫీజు రియంబర్స్ మెంట్ రాదు.దీనిపై జగన్ ప్రభుత్వం జీవో 77 ను తీసుకు వచ్చింది.
ఈ జీవో ద్వారా వారు రియంబర్స్ మెంట్ పొందలేరు.ఈ విషయంపై నారా లోకేష్ ఫైర్ అయ్యాడు.
వెంటనే జీవో 77 ను రద్దు చెయ్యాలని డిమాండ్ చేశాడు.ఈ జీవో రద్దుకు విద్యార్థులు నిరసన తెలుపుతుంటే వారిపై కేసులు పెట్టడం బాదాకరంగ ఉంది అన్నాడు.
స్టూడెంట్స్ తలుచుకుంటే నీవు ని ప్రభుత్వం రెండు కూడా ఉండవు అన్నాడు.ప్రవేట్ కాలేజీల్లో చదివే విద్యార్థుల జీవితం అంద కారంలోకి జగన్ తీసుకెళ్ళాడు.
వాళ్ల జీవితంతో జగన్ ఆటాడుకుంటున్నాడు.
విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు నాయకులు నిరసన చేబడుతుంటే వారిపై అక్రమ కేసులు పెట్టడం చాలా దారుణం అన్నాడు.
ఎన్టిఆర్ అధికారంలో ఉన్నప్పుడు విదేశీ విద్యను ప్రవేశ పెడితే జగన్ దాన్ని నిర్వీర్యం చేశాడు.వెంటనే విదేశీ విద్యను పునరుద్దరించాలని కోరాడు.గతంలో చీరాల పోలీసు స్టేషన్ లో దళిత యువకుడు చనిపోవడంపై నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.జగన్ ప్రభుత్వంలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని అన్నాడు.
దళిత యువకుడు కిరణ్ మాస్క్ పెట్టుకోలేదని చీరాల పోలీసు లు కొట్టి చంపేశారని నారా లోకేశ్ ఆరోపించాడు.అతను చనిపోయి ఏడు నెలలు అవ్వుతున్న ఆ కుటుంబం కు న్యాయం జరగలేదని అన్నాడు.