వారాహి( Varahi yatra ) మలివిడత యాత్ర మొదలవ్వడమే పెద్ద కాంట్రవర్సీతో మొదలైంది.వాలంటరీ వ్యవస్థ పై పవన్ చేస్తున్న సంచలన వ్యాఖ్యల తాలూకూ మంటలు ఈరోజుకి మండుతూనే ఉన్నాయి.
అయితే అవి యధాలాపంగా మాట్లాడిన మాటలు కాదని, వ్యూహాత్మకంగానే పవన్ తన బాణీ మార్చారని , తర్వాతి బహిరంగ సభలలో , కార్యకర్తల సమావేశాలలో ఆయన మాట తీరు చూస్తే అర్థమవుతుంది .
ఎన్నికలకు ఇంకా ఏడు ఎనిమిది నెలలు మాత్రమే సమయం ఉన్నందున జగన్ శక్తులన్నిటిని అష్టదిగ్బంధనం చేయాలనే భారీ వ్యూహంతోనే పవన్( Pawan kalyan ) తేనె తుట్టని కదుపుతున్నారని, జగన్ రాజకీయ బలాన్ని తగ్గించకపోతే వచ్చే ఎన్నికలలో గెలుపు కష్టమని భావిస్తున్న పవన్ జగన్ మానస పుత్రికగా చెప్పుకుంటున్న వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది.తన మాట ల మీద తీవ్ర ప్రతిఘటన ఎదురైనా తగ్గని పవన్ తన తదుపరి సభలలో మరింత ఘాటు వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి ని వ్యక్తిగతం గా సంబోధిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.రాష్ట్రంలోని వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను హైలెట్ చేస్తూ సూటిగా ముఖ్యమంత్రి కేంద్రంగా మాత్రమే విమర్శలు చేస్తున్న పవన్, అధికార పార్టీపై వ్యతిరేకతను భారీ స్థాయిలో పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది .
రాష్ట్రం అన్ని రంగాలలోనూ విఫలమైపోయిందని, సాధారణ ఆరోపణలు కాకుండా పూర్తిస్థాయిలో పార్లమెంట్లో లోను వివిధప్రబుత్వ సంస్థలు విడుదల చేసిన డేటాను తీసుకొని మరీ చెప్తున్న వైనం చూస్తే వారాహి యాత్రకు పవన్ బాగానే ప్రిపేర్ అయినట్టు కనిపిస్తుంది .తమ అదినేత పై పవన్ చేస్తున్న వ్యాఖ్యలు అధికార పార్టీ నేతలను బాగానే ఇబ్బంది పెడుతున్నట్లుగా తెలుస్తుంది.పవన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తున్నప్పటికీ, ఆ డోస్ సరిపోవడం లేదని పవన్ వ్యాఖ్యలకు భారీ ఎత్తున మీడియా నుంచి కవరేజ్ దక్కడంతో ఆయన వ్యాఖ్యలు హైలెట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది.ఇప్పుడు అధికారపక్షం పవన్ కంట్రోల్ చేయడం ఎలా అన్న విషయం పై మల్ల గుల్లాలు పడుతుందని తెలుస్తుంది.
వాలంటరీ వ్యవస్థపై ఆయన చేసిన కామెంట్లపై భారీ ఎత్తున ప్రతిఘటనకు ప్రయత్నించినప్పటికీ మొండిగా ముందుకే వెళుతున్న పవన్ ను ఇప్పుడునిలువరించడం ఎలా అన్నది అతి పెద్ద ప్రశ్నగా మారినట్లుగా తెలుస్తుంది.