వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే పూర్తి చేస్తామని సీఎం జగన్ తెలిపారు.శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించారు.
ఇందులో భాగంగా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష రెండో విడత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం భూముల సమగ్ర రీసర్వే ప్రారంభించామని తెలిపారు.
ఇప్పటికే రెండు వేల రెవెన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి అయిందన్నారు.మొత్తం 7,92,238 మంది రైతులకు భూ హక్కు పత్రాలు అందించినట్లు సీఎం జగన్ వెల్లడించారు.
ఫిబ్రవరిలో రెండో దశలో నాలుగు వేల గ్రామాల్లో భూ సర్వే చేపడతామని వెల్లడించారు.మే 2023 నాటికి 6 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాలు అందజేస్తామని తెలిపారు.
అదేవిధంగా ఆగస్ట్ 2023 నాటికి 9 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామన్నారు.వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే జరుగుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా సర్వే నిర్వహిస్తామని చెప్పారు.రాష్ట్రంలో అన్ని రకాల భూ వివాదాలకు చెక్ పెడతామని వెల్లడించారు.