స్నేహితుడి కోసం ఆ ఇద్దరిని ఒప్పించిన చరణ్‌

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ కు శర్వానంద్‌ కు మద్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇద్దరు కూడా సుదీర్ఘ కాలంగా మంచి స్నేహితులుగా కొనసాగుతూ వస్తున్నారు.

వీరిద్దరి స్నేహం ఇండస్ట్రీ లో చాలా మందికి ఆదర్శం అనడంలో సందేహం లేదు.శర్వా ఏ ప్రాజెక్ట్‌ చేసినా కూడా తనవంతు సాయంను చరణ్‌ అందించడం చూస్తూనే ఉన్నాం.

తాజాగా కూడా చరణ్‌ తనవంతు సహకారంను శర్వానంద్‌ నటించిన శ్రీకారంకు అందించాడు.ఇన్ని రోజులుగా శ్రీకారం సినిమా కు పెద్దగా బజ్‌ లేదు.

కాని ఎప్పుడైతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మెగా స్టార్‌ చిరంజీవి మరియు కేటీఆర్‌ హాజరు అవుతారు అంటూ ప్రకటించారో వెంటనే సినిమా రేంజ్ అలా లేచి పోయింది.ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా ఉంది.

Advertisement

చరణ్‌ ఇటీవల శర్వా తో పుట్టిన రోజు సందర్బంగా కేక్‌ కట్‌ చేయించాడు.ఆ సమయంలో శ్రీకారం సినిమా గురించి చెప్పిన సమయంలో ఒక మంచి సినిమా ప్రమోషన్‌ కోసం ముందుకు రావాలనే ఉద్దేశ్యంతో వెంటనే చిరంజీవి గారికి కాల్‌ చేసి మీరు శ్రీకారం సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కోరాడట.అందుకే చిరంజీవి కూడా ఒప్పుకున్నాడు అంటూ శర్వా చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్‌ కోసం ఇల్లందులో చిరు ఉన్న కారణంగా ఖమ్మంలో ప్రీ రిలీజ్‌ వేడుకను ప్లాన్‌ చేశారు.ఆ వెంటనే స్వయంగా చరణ్‌ కేటీఆర్‌ కు ఫోన్‌ చేసి శ్రీకారం సినిమా కు సపోర్ట్‌ చేయాలంటూ కోరగానే వెంటనే ఆయన కూడా ఒప్పుకున్నాడు.

ఇలా శర్వానంద్‌ కోసం ఇద్దరు ముఖ్యమైన వారిని ఒప్పించడం ద్వారా శ్రీకారం సినిమ రేంజ్‌ అమాంతం పెరిగి పోయింది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు