ఒకపక్క ఆర్ధిక సంక్షోభం తో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కు డ్రాగన్ దేశం బాసటగా నిలిచింది.ఇప్పటికే అంతర్జాతీయ సమాజం లో దాదాపు అన్ని దేశాలు కూడా ఉగ్రవాద నిర్మూలన కోసం చర్యలు తీసుకోకుంటే పాక్ ని ఏకాకి ని చేయాలనీ భావిస్తుండగా చైనా మాత్రం పాక్ కు బాసటగా నిలవాలని ప్రయత్నిస్తుంది.
ఈ నేపథ్యంలో మరో అడుగు ముందుకు వేసి పాక్ సంక్షేమ ప్రాజెక్టు లో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టె యోచనలో ఉన్నట్లు తాజాగా ప్రకటించింది.చైనా-పాక్ ల మధ్య ఇప్పటికే మంచి సంబంధాలు నెరుపుతున్న సంగతి తెలిసిందే.
చైనా-పాక్ మధ్య ఉన్న ఎకనామిక్ కారిడార్ సంతృప్తికరంగా ఉందన్న చైనా రాయబారి యవో జింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు.చైనా-పాకిస్థాన్ ఉచిత వాణిజ్య ఒప్పందం రెండో దశను ఈ ఏడాది అక్టోబరు నాటికి పూర్తి చేస్తామంటోంది చైనా.
పాకిస్థాన్లో ఉన్న వ్యాపార అవకాశాల గురించి చైనాలో.అవగాహన కల్పించేందుకు పాక్కు చెందిన మహిళా వ్యాపారులను పంపనున్నట్లు తెలిపింది.
యూఏఈ ఇప్పటికే 3 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వగా.ఐఎంఎఫ్ కూడా 6 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడం కోసం సూత్రప్రాయంగా అంగీకరించింది.
మరోపక్క ఉగ్రవాద నిర్మూలన కోసం చర్యలు తీసుకోక పోతుండడం పై మండిపడ్డ అమెరికా ఆ దేశానికి అందించే ఆర్ధిక సాయాన్ని కూడా నిలిపివేసిన విషయం విదితమే.
అయితే అంతర్జాతీయ స్థాయిలో పాక్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ చైనా మాత్రం పాక్ ను ఎప్పుడూ వెనకేసుకుంటూ వస్తుంది.
ఈ క్రమంలో లోనే ఆ దేశం తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత పెంచుకునేందుకు ఇలా 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామంటూ తెగ ప్రకటించుకుంటుంది.