టాలీవుడ్ ఇండస్ట్రీలో శర్వానంద్ పేరును పెద్దగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.ఆయన విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం శర్వానంద్ ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘మహాసముద్రం‘ లో నటిస్తున్నాడు.హీరో సిద్దార్థ్ కూడా చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాను లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.అతిధి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు.
అక్టోబర్ 14 న థియేటర్స్ లో రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ వచ్చింది.ఇప్పటికే ఈ సినిమా నుండి హే రంభా సాంగ్ విడుదల అయ్యి మంచి స్పందన తెచ్చుకుంది.ఇక ఇప్పుడు ”చెప్పకే చెప్పకే” అబే సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఒక అప్డేట్ ను విడుదల చేసింది.
దాంతో పాటు ఒక బ్యూటిఫుల్ ఫోటోను జతచేసి వదిలారు.అతిధి రావు హైదరీ చీర కట్టులో ఎంతో అందంగా ఉన్న ఒక పిక్ ను విడుదల చేసింది.ఈ పాట మంచి క్లాసీ మెలోడీ అని మేకర్స్ చెబుతున్నారు.
ఈ సినిమాలో రావు రమేష్, జగపతిబాబు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమాను ఏకే ఎంటెర్టైమెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నాడు.