బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘రూలర్’ చిత్రం వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సినిమా టీజర్ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
సింహా నుండి మొన్నటి జై సింహా వరకు బాలయ్య వస్తున్నాడు అంటూ సింహం గాండ్రింపులు వస్తూనే ఉన్నాయి.ఇంకా ఎంత కాలం ఈ గాండ్రింపులు అంటూ స్వయంగా నందమూరి అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.
బాలయ్య ఇకపై అయినా మారకుండా పరిస్థితి ఏంటీ అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో బాలయ్య చేసిన పలు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.అయినా కూడా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పి ఆశ్చర్యపర్చాడు.అసలు ఇలాంటి సినిమాను చేసేందుకు బాలయ్య ఎలా ఒప్పుకున్నాడంటూ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.
జైసింహా చిత్రం అట్టర్ ఫ్లాప్ అయినా ఆ దర్శకుడితో మళ్లీ సినిమా చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.బాలయ్య మాత్రం స్క్రిప్ట్ తెగ నచ్చడంతో చేశాడంటూ సన్నిహితులు చెబుతున్నారు.
సరే మరో అవకాశం వచ్చినా కేఎస్ రవికుమార్ ఎలాంటి స్క్రిప్ట్ను ఎంచుకున్నాడో చూస్తే అబ్బే అంటారు.ఇటీవల వచ్చిన టీజర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.సినిమాలో యాక్షన్ మరీ శృతిమించేలా ఉండబోతుందని టీజర్ను చూస్తుంటేనే అనిపిస్తుంది.పులిలా గాండ్రిస్తు రౌడీలపైకి బాలయ్య దూకడం ట్రైలర్లోనే చూపించారు.ఇంకా ఎన్నిరోజులు ఇలా సింహాంలా, పులిలా అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.బాలయ్యలో మార్పు రాకుంటే త్వరలోనే ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పే పరిస్థితి వస్తుందని నెటిజన్స్ హెచ్చరిస్తున్నారు.