బుల్లితెర పై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే షో ఎవరినైనా అడుగుతే అందరూ ఇట్లే చెప్పేస్తారు జబర్దస్త్ అని.ఇక ఈ షోకు అత్యధికంగా ప్రేక్షకుల ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే.
అలాగే ఇందులో నటించే వాళ్లకు ఎంతటి క్రేజీ ఉందన్న సంగతి అందరికి తెలిసిందే.అలాగే పేరుకు మాత్రమే వాళ్ళు కమెడియన్లు అయినా కానీ వారి సంపదలో మాత్రం వారు ముందు అంజనలో ఉంటారు.
ఈ తరుణంలో జబర్దస్త్ లో నటించే అప్పారావు రెమ్యునరేషన్ విషయంలో బయట పడిపోయాడు.గతంలో కూడా జబర్దస్త్ కమీడియన్స్ లక్షల్లోనే రెమ్యూనరేషన్లు అందుతున్నట్లు చమ్మక్ చంద్ర వాళ్ళు చెప్పిన సంగతి మనకు తెలిసిందే.
అలాగే ఇటీవల కాలంలో అందరికీ రిమెన్యురేషన్ డబల్ చేస్తారన్న వార్తలు కూడా మనం విన్నాం.జబర్దస్త్ కామెడీ షో కీలకంగా ఉన్న ఒక టీం లీడర్ అప్పారావు రెమ్యునరేషన్ విషయంలో అసలు నిజం బయట పెట్టాడు.
ఒక ప్రముఖ యాంకర్ అప్పారావును మీరు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు అన్న ప్రశ్నకు కాస్త తడపడినట్లే అయినా అసలు నిజం బయట పెట్టాడు.ఈ షో పుణ్యమా అంటూ మేము బాగానే సంపాదించుకుంటున్నని అలాగే బయట కూడా మాకు మంచి పేరు ఉంది అని చెప్పుకొచ్చాడు.
ముఖ్యంగా కామెడీ షో మాత్రమే కాకుండా ఈవెంట్స్ లో పాల్గొనే అవకాశం కూడా వస్తున్నాయని దానిని బట్టి రేటు కూడా ఉంటుందని తెలిపాడు.
అలాగే బయటకు వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు ఒక రోజు జర్నీనే పోతుందని దానికి కూడా రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుందని తెలిపాడు.ఇక అప్పారావు భాస్కర్ టీమ్ లో ఉన్నా కానీ అప్పారావు కంటే భాస్కర్ కే ఎక్కువ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.ఇది ఇలా ఉండగా ప్రస్తుత రోజుల్లో ప్రతి ఈవెంట్లో కూడా అప్పారావు లేకుండా ఉండదన్న పేరును సొంతం చేసుకున్నాడు.
అలాగే 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నా కానీ పెద్దగా గుర్తింపు రాలేదని, కేవలం జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు లభించింద ని చెప్పుకొచ్చాడు.అసలు విషయానికి వస్తే అందరికంటే ఎక్కువ కాకపోవచ్చు.
కానీ, అందరితోపాటు భారీగానే వస్తుందని చెప్పుకొచ్చాడు.హైపర్ ఆది, సుధీర్ లాంటి వాళ్లకు తన కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలియజేశాడు.
అంతేకాకుండా జబర్దస్త్ లో టీం లీడర్ గా వ్యవహరిస్తున్నట్లు లక్షల్లో రెమ్యూనరేషన్ వస్తున్నట్లు ఇండైరెక్ట్ గా తెలియజేశాడు.అంతేకాకుండా కరోనా ఆ సమయంలో కూడా షెడ్యూల్ ప్రకారం డబ్బులు వచ్చాయని, రెమ్యూనరేషన్ విషయంలో మల్లెమాల పర్ఫెక్ట్ అని తెలియచేశాడు అప్పారావు.