ఏపీ అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు..!!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఒకరోజు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.కానీ బీఏసీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఇంకా సమావేశాలు పొడిగించాలని పట్టుబట్టడంతో.

 Ap Assembly Meetings Extended Jagan, Tdp, Atchannaidu, Ys Jagan, Ap Assembly Ses-TeluguStop.com

సీఎం జగన్ ఓకే చెప్పడంతో.ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

అసెంబ్లీ సమావేశం ఒక రోజు కాకుండా పొడిగించాలని బీఏసీ సమావేశంలో ప్రతిపక్ష టీడీపీ కోరడంతో వెంటనే సీఎం జగన్ ఒప్పుకోవడం విశేషం.తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో సీఎం జగన్ మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు పాల్గొనడం జరిగింది.

టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు మరి కొంతమంది నాయకులు హాజరయ్యారు.ఈ క్రమంలో ఒకరోజు మాత్రమే కాక మరికొన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలని ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని.

టిడిపి నాయకులు ఈ సమావేశంలో కోరటంతో.జగన్ ఓకే చెప్పడం జరిగింది.

 సానుకూల వాతావరణంలో సభ సజావుగా సాగేలా.టీడీపీని వ్యవహరించాలని జగన్ కోరినట్లు.

అదేవిధంగా.ప్రతిపక్షాలకు దీటైన రీతిలో సమాధానాలు చెప్పాలని వైసీపీ ప్రజాప్రతినిధులకు జగన్ తెలియజేసినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube