తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ అలియా భట్( Alia bhatt ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో అందం అభినయం కలగలసిన హీరోయిన్ లలో అలియా భట్ కూడా ఒకరు.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగానే సంపాదిస్తోంది అలియా.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
అయితే ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అలియా భట్ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
పెళ్లి అయ్యి ఒక బిడ్డకు తల్లి అయినా కూడా ఆలియా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.అందం విషయంలో కూడా ఏమాత్రం తగ్గలేదు.ప్రస్తుతం వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే తాజాగా అలియా భట్ కి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.ఆ వివరాల్లోకి వెళితే.
అలియా భట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ( Mukesh Ambani ) కుమార్తె ఇషా అంబానీ( Isha ambani )తో జతకట్టారు.ఎడ్-ఎ-మమ్మా అనే వ్యాపార సంస్థతో బిజినెస్ రంగంలోనూ పేరుగాంచిన అలియా భట్, రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్తో చేతులు కలిపారు.
ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు అలియా భట్.ఇషా అంబానీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.
బూట్స్ట్రాప్డ్ వెంచర్ ఎడ్-ఎ-మమ్మా భారతదేశపు అతిపెద్ద రిటైలర్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థలు చేతులు కలిపాయి.ఇక రెండూ కలిసి వ్యాపారం సాగిస్తాయి అని అలియా భట్ పేర్కొన్నారు.ఇద్దరు తల్లులమైన తాము ఇలా చేతులు కలపడం మరింత ప్రత్యేకమైందని వివరించారు.ఎడ్-ఎ-మమ్మా కంపెనీని 2020లో ఏర్పాటు చేశారు అలియా భట్. ఇది ప్రత్యేకంగా పిల్లలు, టీనేజనర్ల దుస్తులు, ప్రసూతి తల్లులకు సంబంధించిన దస్తులు విక్రయించే ఆన్లైన్ షాపింగ్ సంస్థ.ఇక అర్మానీ ఎక్స్ఛేంజ్, బుర్బెర్రీ, జిమ్మీ చూ వంటి ప్రముఖ బ్రాండ్ల సహకారంతో రిలయన్స్ రిటైల్ భారతదేశంలో అతిపెద్ద రిటైలర్లలో ఒకటిగా ఉంది.
దీనికి డైరెక్టర్గా ఉన్న ఇషా అంబానీ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు.