నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ ల గురించి మనందరికీ తెలిసిందే.గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ జంట పేర్లు మారుమోగుతున్నాయి.
ప్రస్తుతం వీరు రిలేషన్ షిప్ లో ఉన్నారు.అంతేకాకుండా త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు.
కానీ ఈ పెళ్లిపై తన మూడవ భార్య రమ్య రఘుపతి అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో నరేష్ ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నారు.ఇప్పటికే నరేష్ పవిత్ర లోకేష్ నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా చేసుకుని మళ్లీ పెళ్లి( Malli Pelli ) అనే సినిమాను కూడా తెరకెక్కించిన విషయం తెలిసిందే.
కానీ సినిమాపై రఘుపతి( Ramya Raghupathi ) కోర్టుని ఆశ్రయించారు.అంతేకాకుండా ఓటీటీ రిలీజ్ డేట్ ని కూడా ఆపేయాలి అంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు రమ్య రఘుపతి.ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక టీవీ షోలో సందడి చేశారు పవిత్ర లోకేష్ నరేష్.ఇందులో బాగానే పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఎంట్రీ ఇవ్వడంతోనే మాస్టారు మాస్టారు అనే పాటకు స్టెప్పులు వేస్తూ ముద్దులు కూడా పెట్టుకున్నారు.టీవీ షోలో భాగంగా నరేష్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది పవిత్ర లోకేష్( Pavitra Lokesh (.
నరేష్ను తాను ముద్దుగా రాయ అని పిలుస్తానంటూ తెలిపింది.అంతకుముందు మళ్లీ పెళ్లి ప్రమోషన్లో భాగంగా పవిత్రని అమ్ములు( Ammulu ) అని ముద్దుగా పిలుస్తానని నరేశ్ ఒక సందర్బంలో చెప్పుకొచ్చాడు.
ఇకపోతే సినిమాల విషయానికి వస్తే ఒకవైపు పెళ్లిళ్ల విషయంలో వరసగా కాంట్రవర్సీలను ఎదుర్కొంటున్న నరేష్( Naresh ) మరోవైపు వరుసగా సినిమాలలో నటిస్తూనే ఉన్నారు.సినిమాలలో తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు నరేష్.ఈ ఏడాదిలో అన్నీ మంచి శకునములే, మళ్లీ పెళ్లి, సామజవరగమన వంటి హిట్ సినిమాల్లో నటించారు నరేష్.ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్లో ఒక కీ రోల్ పోషిస్తున్నారు.