ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన “మా” అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి.బయట రాజకీయ సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో 900మంది.
సభ్యులకు సంబంధించిన ఈ అసోసియేషన్ ఎన్నికలు.మీడియాలో హైలెట్ గా నిలిచాయి.
ఈ క్రమంలో పోటీదారులుగా చాలామంది రంగంలోకి దిగిన చివరాకరికి ప్రకాష్ రాజ్ ప్యానల్ వర్సెస్ మంచు విష్ణు ప్యానల్.అన్నట్టు పరిస్థితి మారింది.
ఈ క్రమంలో రెండు ప్యానల్ కి చెందిన సభ్యులు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు.
ఈ క్రమంలో పోలింగ్ రోజు కూడా దాడులకు పాల్పడటం జరిగింది.
అయితే చివరాకరికి విష్ణు ప్యానల్ ఘనవిజయం సాధించింది.ఇటువంటి తరుణంలో.
రౌడీయిజం తో.మా అసోసియేషన్ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి మంచు విష్ణు గెలిచినట్లు.ప్రకాష్ రాజ్ ప్యానల్ కి చెందిన సభ్యులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు.ఇదే క్రమంలో ప్రకాష్ రాజ్ ప్యానల్ లో గెలిచినవారు రాజీనామా కూడా చేయడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే ప్రకాష్ రాజ్ ప్యానల్ కి చెందిన నటి హేమ.ఈ రోజు విజయవాడ అమ్మవారిని దర్శించుకోవడం కోసం రావడం జరిగింది.
ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి కొండపై మీడియాతో మాట్లాడుతూ రాత్రికిరాత్రి ఫలితాలు ఎలా మారిపోతాయి.అంటూ షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది.“మా” ఎన్నికలలో రాత్రి గెలిచాం ఉదయం కల్లా ఓడిపోయాం.అని ఆవేదన వ్యక్తం చేశారు.
అది ఎలా జరిగిందో నాకు తెలియదు కనీసం మామ వారికైనా తెలుసు తెలియదో.అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ హేమ వైరల్ కామెంట్లు చేశారు.