కడుపు ఉబ్బరం.( Stomach bloating ) అత్యంత సర్వసాధారణంగా వేధించే జీర్ణ సమస్యల్లో ఇది ఒకటి.గ్యాస్ పట్టేసినప్పుడు కడుపు ఉబ్బరంగా మారుతుంటుంది.ఆ సమయంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు.ఆయాసం తన్నేస్తుంటుంది.కూర్చోలేరు నుంచోలేరు.
అయితే అలాంటి సమయంలో కడుపు ఉబ్బరం నుంచి క్షణాల్లో ఉపశమనం పొందడానికి రోజ్ వాటర్ ( Rose water )అద్భుతంగా సహాయపడుతుంది.అవును మీరు విన్నది నిజమే.
మరి ఇంతకీ రోజ్ వాటర్ తో ఎలా కడుపు ఉబ్బరంగా నుంచి బయటపడవచ్చో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో అంగుళం దాల్చిన చెక్క,( Cinnamon ) వన్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకుని రెండు నిమిషాల పాటు మరిగించాలి.ఇప్పుడు ఒక కప్పు ఫ్రెష్ గులాబీ రేకులు వేసి వాటర్ సగం అయ్యేంత వరకు హీట్ చేయాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన గులాబీ నీటిని ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.
ఈ రోజ్ వాటర్ జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపరచడానికి అద్భుతంగా సహాయపడతాయి.అదే సమయంలో కడుపు ఉబ్బరం నుంచి క్షణాల్లో ఉపశనాన్ని అందిస్తాయి.గ్యాస్ సమస్యను( Gas problem ) దూరం చేస్తాయి.
అలాగే కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడే కాదు ఈ రోజ్ వాటర్ ను నిత్యం ఒక కప్పు చొప్పున తీసుకుంటే ఆరోగ్యపరంగా బోలెడు ప్రయోజనాలు పొందుతారు.ముఖ్యంగా ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పరార్ అవుతాయి.
బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.మూత్రపిండాలు మరియు మూత్రాశయం నుండి విషపూరిత వ్యర్థాలు తొలపోతాయి.
మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.నెలసరి సమయంలో మహిళలు ఈ గులాబీ నీటిని రోజుకు రెండు సార్లు తాగితే ఎలాంటి నొప్పులు ఉన్నా సరే మాయం అవుతాయి.
అంతేకాదండోయ్.ఈ గులాబీ నీటిని నిత్యం తాగడం వల్ల స్కిన్ బ్రైట్ గా, షైనీ గా మారుతుంది.
మొటిమల సమస్యకు సైతం దూరంగా ఉండొచ్చు.