మంత్రి కేటీఆర్ సహకారంతో కౌన్సిలర్ కల్లూరి రాజు చేతుల మీదుగా ఎల్ఓసి అందజేత:

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) సిరిసిల్ల పట్టణం 36 వ వార్డు వెంకంపెట్ లో నిరుపేద కుటుంబానికి చెందిన చొక్కి తిరుపతి అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్( NIMS Hospital ) లో చికిత్స పొందుతున్నాడు.నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చులు భరించలేని స్థితిలో ఉండగా కుటుంబ సభ్యులు కౌన్సిలర్ కల్లూరి రాజు ని సంప్రదించారు.

 Counsellor Raju Issued Loc To Poor Family, Counsellor Raju,loc, Poor Family, Raj-TeluguStop.com

వెంటనే కౌన్సిలర్ కల్లూరి రాజు గ స్పందించి మంత్రి కేటీఆర్( Minister KTR ) దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే 2,00,000/- రూపాయల ఎల్ఓసి ని కౌన్సిలర్ కల్లూరి రాజు ద్వారా వారికి అందజేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు.ఈ సందర్భంగా తిరుపతి కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ కి వెంటనే స్పందించి ఎల్ఓసి కి కృషి చేసిన కౌన్సిలర్ కల్లూరి రాజు కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య, ఎర్రం మల్లయ్య, బొల్లి అంబాదాస్ గజావాడ ప్రభాకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube