రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) సిరిసిల్ల పట్టణం 36 వ వార్డు వెంకంపెట్ లో నిరుపేద కుటుంబానికి చెందిన చొక్కి తిరుపతి అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్( NIMS Hospital ) లో చికిత్స పొందుతున్నాడు.నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చులు భరించలేని స్థితిలో ఉండగా కుటుంబ సభ్యులు కౌన్సిలర్ కల్లూరి రాజు ని సంప్రదించారు.
వెంటనే కౌన్సిలర్ కల్లూరి రాజు గ స్పందించి మంత్రి కేటీఆర్( Minister KTR ) దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే 2,00,000/- రూపాయల ఎల్ఓసి ని కౌన్సిలర్ కల్లూరి రాజు ద్వారా వారికి అందజేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు.ఈ సందర్భంగా తిరుపతి కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ కి వెంటనే స్పందించి ఎల్ఓసి కి కృషి చేసిన కౌన్సిలర్ కల్లూరి రాజు కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య, ఎర్రం మల్లయ్య, బొల్లి అంబాదాస్ గజావాడ ప్రభాకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.