అనకాపల్లి జిల్లా( Anakapalli ) అచ్యుతాపురంలో ఎస్కే లాడ్జిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.ఈ క్రమంలో యువతి మృతి చెందగా… యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
యువకుడి శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి.యువతిని హతమరచి తాను కూడా ఆత్మహత్యాయత్నానికి( Suicide Attempt ) పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో కొన ఊపిరితో ఉన్న యువకుడిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు.అచ్యుతాపురం మండలం ఎస్.కె లాడ్జ్ మూడో అంతస్తు 303 రూమ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యువతి శరీరంపై కూడా కత్తి గాయాలు పోలీసులు గుర్తించడం జరిగింది.ఆపస్మరొక స్థితిలో పడి ఉన్న యువకుడు ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఇటీవల ఈ రకంగా లాడ్జీలలో యువతీ యువకుల హత్య ఘటనలు ఎక్కువైపోతున్నాయి.మరి ఈ క్రమంలో అసలు ఈ జంట మధ్య గొడవ ఎందుకు వచ్చింది.? ఆ యువతని చంపింది ఎవరు.? యువకుడు పై కూడా కత్తి గాయాలకు కారణం ఏమిటి.? అనే దాని విషయంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.