రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ సీఎం జగన్ తెలిపారు.ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ప్రధాన రోడ్లు పూర్తి చేయాలని చెప్పారు.రోడ్లు కుంగిపోతున్న చోట ఎఫ్డీఆర్ టెక్నాలజీని వినియోగించాలని తెలిపారు.
ఈ క్రమంలో వచ్చే జూన్, జులై కల్లా నిర్దేశించిన మేర రోడ్లను పూర్తి చేయాలని పేర్కొన్నారు.అదేవిధంగా రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను కూడా పూర్తి చేయాలని వెల్లడించారు.
విశాఖ నుంచి భోగాపురానికి వెళ్లే రోడ్లు నిర్మాణంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.