చెంచాగిరి అంటూ కైకాల మృతి పై పోసాని షాకింగ్ కామెంట్స్!

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం తెల్లవారుజామున ఇంటిలోనే ఆఖరి శ్వాస వదిలారు.ఇలా ఈయన మరణ వార్త తెలుసుకున్న టువంటి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు ఈయన మృతికి సంతాపం తెలియజేశారు.

 Posani Krishnamurali Emotional Words About Kaikala Satyanarayana,posani Krishnam-TeluguStop.com

ఇక దిగ్గజ నటుడు కైకాల మరణించడంతో సినీ సెలబ్రిటీలు మొత్తం తరలివచ్చి ఈయనకు నివాళులు అర్పించారు.ఇలా కైకాలకు సినీ సెలబ్రిటీలు, అభిమానులు, తుది వీడ్కోలు పలికారు.
ఇక కైకాల సత్యనారాయణ మరణ వార్త తెలిసినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధానమంత్రి కూడా సంతాపం ప్రకటించారు.అయితే తరచూ ఏదోక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉన్నటువంటి పోసాని కృష్ణ మురళి కైకాల మరణం గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా పోసాని కైకాల గురించి మాట్లాడుతూ.చెంచాగిరి చేయకుండా, డ్రామాలు ఆడకుండా నిజాయితీగా బతికిన వ్యక్తి కైకాల సత్యనారాయణ.

కాలం ఉన్నంతకాలం కాకపోయినా సినీ కళాకారులు ఉన్నంతకాలం బ్రతికి ఉండే నటుడు కైకాల జోహార్ అంటూ పోసానీ కైకాల మరణం పై స్పందిస్తూ కామెంట్స్ చేశారు.ఈ విధంగా పోసాని కృష్ణమురళి కైకాల మరణం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.పోసాని వ్యాఖ్యలు పొలిటికల్ గా ఏదో ఆ టెన్షన్ చేసినట్లు ఉందని కొందరు ఈయన వ్యాఖ్యలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube