నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా…డుగ్గు డుగ్గు డుగ్గని.అనే పాట ఎంత పాపులర్ అయిందో చెప్పనక్కర్లేదు.
సోషల్ మీడియానే ఓ దశలో ఒక ఊపు ఊపింది.పెండ్లి, భరత్, తదితర శుభ కార్యాలప్పుడు ఆ పాటనే మోత మోగించారు.
అప్పటి వరకు ఎవరూ తెలియని నవ వధువు ఆ పాటకు చేసిన డ్యాన్స్తో రాత్రికి రాత్రే పాపులరైంది.సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరగడంతో అలాంటి వైరల్ వీడియోలు రోజుకోటి హల్చల్ చేస్తున్నాయి.
ఒక్క రోజులోనే సోషల్ మీడియా స్టార్లుగా మారుతున్నారు.అప్పటి వరకు ప్రపంచానికి తెలియని వారు సెలబ్రిటీలుగా అవతారమెత్తుతున్నారు.
ఇలాంటి వారు అనేకమంది ఉన్నారు.ఉదయం లేచింది మొదలుకుని రాత్రి నిద్రపోయే వరకు చేతిలో స్మార్ట్ ఫోన్ గానీ, ఇంటిలో కంప్యూటర్, ల్యాప్టాప్ ఉంటే చాలు సోషల్ మీడియాకే అధిక సమయం వెచ్చిస్తుంటారు.
దీంతో వైరల్ వీడియోలకు ఆదరణ లభిస్తున్నది.ఏదైనా వెరైటీగా చేస్తే చాలు అట్టే పాపులర్ అవ్వచ్చు.ఇలానే ఓ చిరు వ్యాపారి పల్లీలు అమ్ముకునేందుకు- కచ్చాబాదమ్- అంటూ పాడిన పాటతో ప్రపంచ దృష్టినే ఆకర్షించాడు.అతనే పశ్చి బెంగాల్ కు చెందిన భుబన్ బద్యాకర్ .అతను తన కస్టమర్లను ఆకర్షింఏందుకు ఆ పాట పాడాడు.అది సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.
తాజాగా ఆ సాంగ్కు ఇద్దరు తల్లికూతుర్లు డ్యాన్స్ చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అది కాస్త వైరల్ అయి ట్రెండింగ్గా మారింది.
ఏపాటైనా సరే … ఎలాంటిదైనా అన్ని తెలియకున్నా డాన్స్ చేసి ఆకట్టుకుంటున్నారు.దీనికి పేద, ధనిక తారతమ్యాలు లేవు.
సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకు వర్తిస్తుంది.ఇందుకు సోషల్ మీడియానే మార్గంగా మారుతోంది.
తమలోని కళలను, ప్రతిభను కనబర్చేందుకు వేదికగా మారుతోంది.