కూకట్పల్లి ఎంపీ అరవింద్ కుమార్ పై దాడిని నిరసిస్తూ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో కేపిహెచ్ బి రోడ్ నంబర్ వన్ గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేసి, నిరసన వ్యక్తం చేసారు.
ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తెరాస గ్రాఫ్ పొడిపోతుంది అనే భయంతో ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేస్తూ వారిపై అక్రమంగా కేసులు మరియు దాడులకు పాల్పడుతున్నారని మేము తెరాస అన్యాయాలను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయ పరంగా మిమ్మల్ని శిక్షించే వరకు ఈ ఆందోళనలు చేస్తామని అన్నారు
.