బిపిన్ రావత్ ఆర్మీ ఉన్నతాధికారి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.భారత త్రివిధ దళాల అధిపతిగా ఉన్న వ్యక్తి హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించడం పట్ల.
కేంద్ర పెద్దలతో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు.తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణించినట్లు వార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు స్పష్టం చేశారు.
ఆయనతో పాటు భార్య, 11 మంది ఈ దుర్ఘటనలో మరణించడం అత్యంత బాధాకరం అని స్పష్టం చేశారు.
అత్యున్నత సిడిఎస్ బాధ్యతలను చేపట్టిన అధికారిగా బిపిన్ రావత్ దేశానికి అద్భుతమైన సేవలందించారని స్పష్టం చేశారు.
దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి ఆయన అందించిన సేవలు.మర్చిపోలేనివి ఆయన మృతి దేశానికి తీరని లోటు అని స్పష్టం చేశారు.
ఇదే దుర్ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన సాయి తేజ్ అనే వ్యక్తి చనిపోయాడు అని తెలిసి బాధపడినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన మృతుల ఆత్మలకు శాంతి కలగాలని.
భగవంతునికి ప్రార్థిస్తున్నట్లు వాళ్ల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు పవన్ స్పష్టం చేశారు.ఇక ఇదే సమయంలో ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రకటనలో స్పష్టం చేశారు.