ప్రస్తుత కాలంలో అధిక బరువు సమస్యతో సతమతమవుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, నిద్ర లేమి, ప్రెగ్నెన్సీ, పలు రకాల మందుల వాడకం తదితర అంశాలు శరీర బరువును ప్రభావితం చేస్తాయి.
ఏదేమైనప్పటికీ బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నట్లే.తగ్గడానికి సైతం మరెన్నో మార్గాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే వాటర్ ను ప్రతి రోజు గనుక తీసుకుంటే అధిక బరువు సమస్య దూరం అవ్వడమే కాదు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ సైతం లభిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం అధిక బరువును తగ్గించే ఆ వాటర్ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా పది ఫ్రెష్ తులసి ఆకులను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి మెత్తగా దంచుకోవాలి.
అలాగే అర స్పూన్ వాము, రెండు మిరియాలను కూడా తీసుకుని పొడి చేసి పెట్టుకోవాలి.
ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో దంచి పెట్టుకున్న తులసి ఆకులు, వాము-మిరియాల పొడి వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
ఇలా మరిగించిన వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని తాగేయడమే.
రోజు ఉదయాన్నే ఈ వాటర్ లో కనుక తీసుకుంటే వేగంగా బరువు తగ్గుతారు.అదే సమయంలో శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.బాడీ డీటాక్స్ అవుతుంది.
రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సీజనల్ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
మరియు ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు సైతం దూరం అవుతాయి.కాబట్టి, అధిక బరువు ఉన్నవారే కాదు ఎవ్వరైనా ఈ వాటర్ను తీసుకోవచ్చు.