మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను ప్రెసెంట్ RC15 అనే వర్కింగ్ టైటిల్ పెట్టి తెరకెక్కించ బోతున్నారు.
ఈ సినిమా ఈ మధ్యనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతుంది.తాజాగా ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఇప్పటి వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేయ బోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరా తర్వాత అక్టోబర్ 21న ప్రారంభించ బోతున్నట్టు తెలుస్తుంది.
మొదటి షెడ్యూల్ పూణే లో ప్లాన్ చేసినట్టు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్ ను హైదరాబాద్ నగర శివార్లలో ఏర్పాటు చేసారని ఇక్కడే షూటింగ్ జరుగుతుందని చెబుతున్నారు.శంకర్ ఇంతకు ముందు సినిమాలన్నీ సంవత్సరాలైనా పూర్తి అయ్యేవి కాదు.కానీ ఈ సినిమా మాత్రం వచ్చే ఏడాది కల్లా పూర్తి చేయాలనీ దిల్ రాజు, శంకర్టార్గెట్ పెట్టుకున్నారని టాక్.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.
ఈ సినిమా మొదటి షెడ్యూల్ రామ్ చరణ్, కియారా పై జరగబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.రామ్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని జనవరి 7న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
జనవరి లోపులోనే ఒక షెడ్యూల్ పూర్తి చేసి చరణ్ ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొనాలని అనుకుంటున్నాడట.అందుకే ఈ లోపులోనే ఒక షెడ్యూల్ పూర్తి చెయ్యాలని అనుకుంటున్నారు.