టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా ఉంటుంది అనే విషయం తెల్సిందే.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కథ ను తయారు చేయడం లో విజయేంద్ర ప్రసాద్ తల మునకలై ఉన్నాడు.
ఆయన పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ మహేష్ బాబు కోసం ఒక భారీ అడ్వెంచర్ మూవీ కథను తయారు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.ఆ కథ ఏంటీ.
ఇతర వివరాల గురించి త్వరలోనే క్లారిటీ వస్తుంది.బాహుబలి సినిమా తర్వాత జక్కన్న నుండి రాబోతున్న ప్రతి సినిమాను కూడా అభిమానులు అదే రేంజ్ లో ఊహించుకుంటున్నారు.
కనుక మహేష్ బాబుతో రాజమౌళి చేయబోతున్న సినిమా ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు కూడా బాహుబలిని.ఆర్ ఆర్ ఆర్ ను మించి ఉంటుంది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను జక్కన్న దర్శకత్వంలో చేయబోతున్న సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు.
రాజమౌళితో తన సినిమా ఉంటుంది.
కాని అది ఎప్పుడు ఎలా ఉంటుంది అనే విషయంలో ఇప్పుడే చెప్పలేను.కాని నేను చేయబోతున్న ఆ సినిమా మరో బాహుబలి లా మాత్రం ఉండదు అంటూ నవ్వుతూ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.
బాలీవుడ్ మీడియా సంస్థతో మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా ముచ్చటించాడు.ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలను చేయడం జరిగింది.
పెద్ద ఎత్తున అంచనాలున్న సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన షూటింగ్ లో మహేష్ బాబు పాల్గొంటున్నాడు.ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నాడు.
ఈ రెండు సినిమా ల తర్వాత అంటే వచ్చే ఏడాది చివరి వరకు మహేష్ బాబు రాజమౌళిల కాంబో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.షూటింగ్ ప్రారంభం కాకున్నా కూడా కనీసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయినా షురూ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్.