టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.తెలుగుతో పాటు తమిళ్, మలయాళం లో కూడా అల్లు అర్జున్ అభిమానులు ఉన్నారు.
అంతేకాదు ఆయన చేసిన సినిమాలు యూట్యూబ్ లో ఇప్పటికే చాలా రికార్డ్స్ క్రియేట్ చేసాయి.తాజాగా ఆయన నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప నుండి వచ్చిన టీజర్ కూడా నెవర్ బిఫోర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇతర మార్కెట్ పైన కూడా ద్రుష్టి పెట్టాడు. పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మరిన్ని అంచనాలు పెంచుకున్నారు.ఈ సినిమాను టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.అల్లు అర్జున్ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.అందుకే 250 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ మధ్యే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ భారీ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.
తెలుగులో మొదటిసారిగా 73 మిలియన్ వ్యూస్ తో 1.మిలియన్ లైక్స్ తో భారీ రికార్డ్ క్రియేట్ చేస్తూ ఇంకా దూసుకు పోతుంది.ఈ స్పీడ్ ఇప్పట్లో ఆగేలా లేదు.ఈ నెవర్ బిఫోర్ రికార్డ్ ను అల్లు అర్జున్ మొదటిసారి క్రియేట్ చేయడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటె ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రష్మిక ఒక గిరిజన యువతిగా నటిస్తున్నట్టు టాక్.ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.త్వరలోనే విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.