కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ షర్మిల.. !

తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశ్యంతో రాజకీయ రంగప్రవేశం చేసిన వైఎస్ షర్మిల పలు కార్యక్రమాలని నిర్వహిస్తూ, పార్టీని ముందుకు ఎలా నడిపించాలనే క్రమంలో పలువురు వైఎస్ అభిమానుల సలహాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే.

 Ys-sharmila Temporarily Postponed Riley Strikes Telangana, Ys Sharmila, Temporar-TeluguStop.com

ఈ నేపధ్యంలో ఎన్నో పొలిటికల్ మీటింగ్‌లు, ఆత్మీయ సమావేశాలు ఇప్పటి వరకు నిర్వహించింది.

అంతే కాకుండా గత ఆరేళ్ల కాలంలో ఉద్యోగ నియామకాల విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇందు వల్ల ఉద్యోగాలు రాక యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదనతో, వారికి అండగా నిలిచి, భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఉద్యోగ సాధన రిలే నిరాహార దీక్షలను ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొన్న షర్మిల ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారట.

తెలంగాణలో కరోనా

సెకండ్ వేవ్ ఉద్ధృతి

ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం.

ఇక ఈ నిర్ణయం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు, పరిస్దితులు సర్దుకోగానే తన ఉద్యమాన్ని ప్రారంభిస్తానని వెళ్లడించారట షర్మిల.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube