బాలీవుడ్ మెగాస్టార్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.దాదాపు మూడు వారాల క్రితం అమితాబచ్చన్ కరోనా కారణంగా ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు.
అప్పటి నుండి పు దఫాలుగా కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నప్పటికి పాజిటివ్ రాలేదు.కాని తాజాగా ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థలో అమితాబచ్చన్ ఆరోగ్యం కుదుట పడ్డట్లుగా వార్త ప్రసారం అయ్యింది.
దాంతో అభిమానులు అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు.
జాతీయ మీడియా సంస్థలో రావడంతో అంతా కూడా ఆ వార్త నిజం అయ్యి ఉంటుందని భావించారు.
సినీ ప్రముఖులు కూడా ఈ విషయమై నిర్థారించుకునేందుకు బచ్చన్ ఫ్యామిలీ మెంబర్స్కు కాల్ చేయడం జరిగింది.కాని అసలు విషయం ఏంటీ అంటే ఇంకా అమితాబ్ కరోనా నెగటివ్ అవ్వలేదు.
ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.తనకు బాగయినట్లుగా సోషల్ మీడియాలో ఉన్న ఒక పోస్ట్ ను రీట్వీట్ చేసి ఈ వార్త నిజం కాదు.
బాధ్యతారాహిత్యమైన వార్త, ఫేక్ మరియు సమర్థనీయమైన వార్త కాదు అంటూ ట్వీట్ చేశాడు.
అమితాబ్ ట్వీట్తో అది కేవలం పుకారు అనే క్లారిటీ వచ్చింది.అభిమానుల ఆనందం కొన్ని గంటలు కూడా నిలవలేదు.అమితాబ్ ఆరోగ్యం విషయంలో మళ్లీ అభిమానుల్లో ఆందోళన స్టార్ట్ అయ్యింది.
పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన పలువురు వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నా కరోనా నెగటివ్ మాత్రం రావడం లేదని వైధ్యులు కూడా అంటున్నారు.
కరోనా నిర్థారణ పరీక్ష రెండు సార్లు నెగటివ్ వచ్చిన తర్వాత అమితాబ్ నానావతి నుండి బయటకు వచ్చే అవకాశం ఉందట.