టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించే సినిమాలు ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్ను తెచ్చిపెట్టాయి.ప్రతి సినిమాతో ఆయన తన పేరును విశ్వవ్యాప్తంగా పెంచుకుంటూ వెళ్లాడు.
ఇక టాలీవుడ్ క్రేజీ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచి, సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇండస్ట్రీ హిట్ అందించిన పోకిరి చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో మహేష్ తనదైన మార్క్ను వేసుకోవడంలో చాలా సక్సెస్ అయ్యాడు.
ఇక ఈ సినిమాలోని డైలాగులకు ప్రేక్షకులు ఎంతమేర అడిక్ట్ అయ్యారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఈ సినిమాలో మహేష్ చెప్పే డైలాగులు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
ఈ సినిమా సృష్టించిన ప్రభంజనాన్ని ప్రేక్షకులు ఇప్పటి వరకు మర్చిపోలేదు.కాగా తాజాగా ఈ సినిమాలోని ఫేమస్ డైలాగ్ను స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇమిటేట్ చేయడంతో మరోసారి పోకిరి చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
ఈ సినిమాలో మహేష్ తనదైన యాక్సెంట్లో చెప్పిన డైలాగుకు వార్నర్ యాక్టింగ్ పర్ఫెక్ట్గా కుదిరింది.
దీంతో ఈ వీడియోను సోషల్ మీడియాలో ప్రేక్షకులు తెగ షేర్లు చేస్తుండటంతో వైరల్గా మారింది.
కాగా ఈ వీడియోను చూసిన పూరీ జగన్నాథ్, వార్నర్ను అభినందిస్తూ ఓ ట్వీట్ చేశాడు.అందులో మహేష్ బాబును ట్యాగ్ చేయకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి ఇండస్ట్రీ హిట్ అందించిన హీరోను ఎలా మరుస్తాడని పూరిని ఓ రేంజ్లో ఏసుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్.ఏదేమైనా ఒక్క ట్వీట్తో మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చవిచూశాడు ఈ స్టార్ డైరెక్టర్.