అక్కినేని ఫ్యామిలికి, మెగాఫ్యామిలికి మంచి సంబంధాలే ఉన్నాయి.చిరంజీవి, రామ్ చరణ్ .
ఇద్దరు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ తో క్లోజ్ గానే ఉంటారు.కాని అల్లు ఫ్యామిలితో మాత్రం అక్కినేని ఫ్యామిలికి ఇప్పుడు సరైన సంబంధాలు లేవు అని, ముఖ్యంగా అఖిల్ కి – అల్లు శిరీష్ కి అస్సలు పడట్లేదని టాక్.
ఈ ఇద్దరు కుర్రహీరోలకి ఎందుకు చెడిందో మేం ప్రత్యేకంగా చెప్పాలా? కారణం మీకు గుర్తుకు ఉండే ఉంటుంది.ఒకవేళ మర్చిపోయారంటే చెప్పండి, మళ్ళీ గుర్తుచేస్తాం.
వీరిద్దరి మధ్య గొడవకి కారణం శ్రియా భూపాల్.అఖిల్ మాజి స్నేహితురాలు, మాజి ప్రేయసి అయినా శ్రియ వల్లే ఈ ఇద్దరు హీరోల మధ్య మంటలు రగులుతున్నాయి.
ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళిన అఖిల్ – శ్రియల రిలేషన్, అక్కడితోనే ఆగిపోయిందన్న సంగతి తెలిసిందే.వీరిద్దరు ఎందుకు విడిపోయారో ఇప్పటివరకు స్పష్టంగా ఎవరికి తెలియదు.
శ్రియ – అల్లు శిరీష్ మధ్య ఉన్న స్నేహమే వీరిద్దరు విడిపోవడానికి కారణం అని బలమైన టాక్ ఉంది.ఈ రూమర్ కి ఓ పెద్ద ఆధారంలా కొన్నిరోజుల క్రితం అల్లు శిరీష్ – శ్రియల పర్సనల్ ఫోటోలు కొన్ని బయటకి కూడా వచ్చాయి.
అప్పటినుంచి అఖిల్ ఇంకా హర్ట్ అయ్యాడట.ఈమధ్య ఓ పార్టీకి ఇద్దరు హాజరైనా, ఎడముఖం పెడముఖం అన్నట్టుగానే ఉంటూ, కనీసం పలకరించుకోలేదట.
ఇదంతా చూస్తోంటే అఖిల్ – శిరీష్ మధ్య చాలా పెద్ద గొడవే జరిగిందని, ఈ ఇద్దరు ఇప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడటం లేదని అనిపిస్తోంది.పాపం అఖిల్ .పూర్తిగా కెరీర్ మీదే మనసు లగ్నం చేయాల్సిన సమయంలో ఇలాంటి టెన్షన్స్ ఎదుర్కొంటున్నాడు.
ఇక సినిమాల గురించి మాత్రమే మాట్లాడుకుంటే ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్.
అక్కినేని నాగార్జున దీనికి నిర్మాత.ఈ సినిమా పూర్తవగానే అఖిల్ ఒక తెలుగు – హిందీ ద్విభాష చిత్రం చేసే ఆలోచనలో ఉన్నట్లు, దానికి కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు వార్తలొస్తున్నాయి.