ఏందయ్యా పవన్ కళ్యాన్ జనసేన అన్నావు.అధికార పార్టీలు ప్రజలకు అన్యాయం చేస్తే ఒంటి కాళ్ళపై లేస్తానని చెప్పవు.
నిజమె అనుకున్నారు తెలుగు ప్రజలు.వోట్లేసి నీవు చెప్పిన పార్టీలకు గెలిపించారు.
ఇప్పుడు రాక్షస పాలనను గుర్తుకు తెచ్చేల పాలిస్తున్న చంద్రబాబు ను నిలదీస్తానన్నావు .ఒకరోజు కూడా నీ మాట మీద నీవు నిలబడలేదు సరికదా ఇంతలో ఎలా మాట మార్చావు అని విశాఖ జిల్లా వై కాప అధక్షుడు గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్తాయిలో పవన్ కళ్యాన్ తీరును దుయ్యబట్టారు .రైతులతో మాట్లాడాక అవసరమయితే వారికోసం పవన్ ఆమరణ దీక్ష చేస్తామన్నారు .ఇప్పుడు ఆ దిశలో అడుగులు వేయడం లెదు.ఇది పవన్ కల్యాణ్ రాజకీయాలు అని దుయ్యబట్టారు.మరోవైపు రైతు సంఘనాయకులు కూడా విమర్శలు చేసారు.ఇలా అమ్ముడు పోయే రాజకీయాలు చేస్తే పవన్ కు ఆయన ఎప్పుడో పెట్టాల్సిన జనసేనకు పుట్టగతులుండవు అని తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పించారు.-వై యస్ ఆర్