Phalguna Amavasya ; ఫాల్గుణ అమావాస్య ఎప్పుడు జరుపుకుంటారు.. దీని ప్రాముఖ్యత ఇదే..!

ఫాల్గుణ మాసంలోని అమావాస్య( Phalguna Amavasya ) తేదీని ఫాల్గుణ అమావాస్య అని అంటారు.ఇది హిందూమతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.

 When Is Phalguna Amavasya Celebrated This Is Its Importance-TeluguStop.com

ఫాల్గుణ అమావాస్య రోజున స్నానం చేసి దానం చేస్తే దేవతలతో పాటు పూర్వికుల అనుగ్రహం కూడా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.పూర్వీకులు సంతోషంగా ఉండే ఇంట్లో ఎప్పుడూ సుఖం, ఐశ్వర్యం, శాంతి ఉంటుంది.

పురాతన గ్రంధాల ప్రకారం పూర్వీకులను అమావాస్య తిధికి అధిపతులుగా పరిగణిస్తారు.అందువల్ల ఈ రోజున పూర్వీకులకు తర్పణం ఇవ్వడం ఎంతో ముఖ్యం.

అయితే ఈ సారి ఫాల్గుణ అమావాస్య తేదీ విషయంలో చాలా గందరగోళం ఏర్పడింది.

అటువంటి పరిస్థితిలో ఫాల్గుణ అమావాస్య ఎప్పుడు దాని ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వేద పంచాంగం ( Vedic almanac )ప్రకారం అమావాస్య తిధి మార్చి 9వ తేదీన సాయంత్రం 6:17 నిమిషములకు మొదలై, మార్చి 10వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల 29 నిమిషములకు ముగిసిపోతుంది.అటువంటి పరిస్థితిలో ఫాల్గుణ అమావాస్య ఉదయించే తేదీ ప్రకారం పూజించబడుతుంది.

ఫాల్గుణ అమావాస్య రోజున స్నానాలు మరియు దానధర్మాలు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి.ఈ రోజున తెల్లవారు జామున 4.49 నిమిషముల నుంచి 5.48 నిమిషముల వరకు స్నానము, దానము చేయుటకు శుభ ముహూర్తాలు ఉన్నాయి.

Telugu Flowers, Importance, Vedic Almanac-Latest News - Telugu

అంతేకాకుండా అభిజిత్ ముహూర్తన్ని( Abhijit Muhurtani ) కూడా పవిత్రమైనదిగా భావిస్తారు.అలాగే పంచాంగం ప్రకారం మధ్యాహ్నం 12:08 నుంచి మధ్యాహ్నం 1:55 నిమిషాల వరకు ఉంటుంది.ఫాల్గుణ అమావాస్య రోజున గంగా స్నానం చేయడం శుభప్రదం అని పండితులు చెబుతున్నారు.అలా చేయలేని వారు ఇంట్లో శుభ ముహూర్తంలో కొద్దిగా గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు.

ఫాల్గుణ అమావాస్య రోజున పూర్వీకులకు తరపున సమర్పించడం ఎంతో ముఖ్యం.పూర్వీకులకు పూజలు చేయడం వల్ల సుఖ సంతోషాలతో పాటు వారి అనుగ్రహం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

Telugu Flowers, Importance, Vedic Almanac-Latest News - Telugu

పూర్వికుల ఆశీస్సులు ఉన్న ఇల్లు సుభిక్షంగా ఉంటుంది.ఫాల్గుణ అమావాస్య రోజున తెల్లటి పూలు, నల్ల నువ్వులనూ ఒక కుండ నీటిలో వేసి పూర్వీకులకు నైవేద్యంగా సమర్పించాలి.పూర్వీకులకు నీరు సమర్పించాలంటే అరచేతిలో నీరు తీసుకుని బొటనవేలు వైపు నుంచి నైవేద్యం పెట్టాలి.మత విశ్వాసాల ప్రకారం అరచేతిలో బొటన వేలు ఉన్న భాగాన్ని పితృతీర్థం అని పిలుస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube