విజయ్ దేవరకొండ ఎప్పటికప్పుడు వెండి తెరపైనే కాకుండి రియల్ లైఫ్ లో కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.అద్బుతమైన నటనతో పాటు అన్ని రకాలుగా కూడా విజయ్ దేవరకొండ ఆకట్టుకునేలా చేస్తున్నాడు.
ఆమద్య కేరళలో వరదలు వచ్చినప్పుడు తన వంతు సాయంగా ఆర్థిక సాయంఉ అందించిన విషయం తెల్సిందే.ఇక తనకు వచ్చిన అవార్డును వేలం పాట వేయడం ద్వారా వచ్చిన మొత్తంను తెలంగాణ ప్రభుత్వంకు ఇచ్చి పేదలకు సాయం చేయాలని సూచించిన విషయం తెల్సిందే.
తాజాగా వీర మరణం పొందిన ఆర్మీ జవాన్ల కోసం విజయ్ దేవరకొండ తనవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.
ఇటీవల జమ్మూ కాశ్మీర్లో జరిగిన మానవ బాంబు దాడిలో చనిపోయిన 40 మంది జవాన్ల ఆర్ధిక సాయం నిమిత్తం భారత్ కే వీర్ వెబ్ సైట్ ఫండ్స్ ను రైజ్ చేస్తుంది.వారి కోసం కొన్ని వందల మంది తమకు తోచిన సాయంను చేస్తున్నారు.విజయ్ దేవరకొండ టాలీవుడ్ నుండి మొదటి వాడుగా వచ్చి ఆర్థిక సాయంను చేయడం జరిగింది.
విజయ్ దేవరకొండ చేసిన సాయంకు గాను భారత్ కే వీర్ వెబ్ సైట్ వారు ఒక సర్టిఫికెట్ను కూడా ఇవ్వడం జరిగింది.ఇతర హీరోలు కూడా ఇలా తమకు తోచిన విధంగా సాయం చేయాలంటూ విజయ్ దేవరకొండ పిలుపునిచ్చాడు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.ఆ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.మరో వైపు క్రాంతి మాధవ్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.ఆ సినిమా కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది.ఈ ఏడాదిలో ఈ రెండు సినిమాలను విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.ఈ రెండు మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండ ఇంకా చాలా సినిమాలకే కమిట్ అయ్యాడు.
కాని వాటికి కాస్త సమయం పట్టనుంది.