వీడియో వైరల్: అడవిలో ఇనుప గొలుసులతో 40 రోజులు భార్యను‌ బంధించిన భర్త..

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు బిజీబిజీ జీవితంతో గడిపేస్తున్నారు.ముఖ్యంగా భార్యాభర్తలు బిజీ లైఫ్ కు అలవాటు పడటంతో వారి మధ్య అనేక మనస్పర్ధల కారణంగా ఎన్నో గొడవలు చేసుకుంటున్నాయి.

 Video Viral: Husband Chained His Wife For 40 Days In The Forest With Iron Chain-TeluguStop.com

దాంతో పెళ్లయిన కొద్ది రోజులకే విడిపోతున్నాయి నవ జంటలు.ఇకపోతే తాజాగా ముంబై( Mumbai ) నగరానికి 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధు దుర్గ్ అటవీ ప్రాంతంలో ఓ అమెరికన్ మహిళను తన భర్త చెట్టు కట్టేసి ఉంచాడు.

ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

ముంబై నగరానికి సుమారు 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధు దుర్గ్( Sindhudurg) అడవి ప్రాంతంలో ఓ 50 సంవత్సరాల వయసున్న అమెరికన్ మహిళ లిలిత కాయి ని ఆవిడ భర్త 40 రోజుల క్రితం ఓ చెట్టుకు ఇనుప గొలుసులతో కట్టేసి అక్కడ బంధించాడని ఆవిడ తెలిపింది.40 రోజులు అలా గడిపిన ఆవిడను తాజాగా ఓ గొర్రెల కాపరి కంటపడింది.గొర్రెల కాపరి గొర్రెలను కాపు కొనేందుకు అడవుల్లోకి వెళ్ళగా అక్కడ ఓ వ్యక్తికి ఆ అమెరికన్ మహిళ కనబడింది.దీంతో సమాచారాన్ని పోలీసులకు అతడు చేరవేగా వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి మహిళలను ఆసుపత్రికి తరలించారు.

ఇక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత ఆ మహిళను వారు పరిశీలించగా.ఆమె దగ్గర అమెరికన్ పాస్ పోర్ట్, అలాగే తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ చిరునామాతో ఉన్న ఆధార్ కార్డును గుర్తించారు.ఇక ఆ మహిళను ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆ మహిళ ఓ పేపర్ పై తన భర్త ఈ విధంగా తనను ఇనుప గొలుసులతో బంధించాడని ఓ పేపర్ పై రాసి ఆసుపత్రి సిబ్బందికి చూపించింది.దింతో ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది.

ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube