ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు బిజీబిజీ జీవితంతో గడిపేస్తున్నారు.ముఖ్యంగా భార్యాభర్తలు బిజీ లైఫ్ కు అలవాటు పడటంతో వారి మధ్య అనేక మనస్పర్ధల కారణంగా ఎన్నో గొడవలు చేసుకుంటున్నాయి.
దాంతో పెళ్లయిన కొద్ది రోజులకే విడిపోతున్నాయి నవ జంటలు.ఇకపోతే తాజాగా ముంబై( Mumbai ) నగరానికి 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధు దుర్గ్ అటవీ ప్రాంతంలో ఓ అమెరికన్ మహిళను తన భర్త చెట్టు కట్టేసి ఉంచాడు.
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
ముంబై నగరానికి సుమారు 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధు దుర్గ్( Sindhudurg) అడవి ప్రాంతంలో ఓ 50 సంవత్సరాల వయసున్న అమెరికన్ మహిళ లిలిత కాయి ని ఆవిడ భర్త 40 రోజుల క్రితం ఓ చెట్టుకు ఇనుప గొలుసులతో కట్టేసి అక్కడ బంధించాడని ఆవిడ తెలిపింది.40 రోజులు అలా గడిపిన ఆవిడను తాజాగా ఓ గొర్రెల కాపరి కంటపడింది.గొర్రెల కాపరి గొర్రెలను కాపు కొనేందుకు అడవుల్లోకి వెళ్ళగా అక్కడ ఓ వ్యక్తికి ఆ అమెరికన్ మహిళ కనబడింది.దీంతో సమాచారాన్ని పోలీసులకు అతడు చేరవేగా వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి మహిళలను ఆసుపత్రికి తరలించారు.
ఇక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత ఆ మహిళను వారు పరిశీలించగా.ఆమె దగ్గర అమెరికన్ పాస్ పోర్ట్, అలాగే తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ చిరునామాతో ఉన్న ఆధార్ కార్డును గుర్తించారు.ఇక ఆ మహిళను ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆ మహిళ ఓ పేపర్ పై తన భర్త ఈ విధంగా తనను ఇనుప గొలుసులతో బంధించాడని ఓ పేపర్ పై రాసి ఆసుపత్రి సిబ్బందికి చూపించింది.దింతో ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది.
ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.