పండు బొప్పాయి మాదిరే పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి మంచిదని చాలా మంది ఆహారంలో భాగం చేసుకుంటారు.ముఖ్యంగా పచ్చి బొప్పాయితో కూర, పచ్చడి, హవ్వా వంటివి చేసుకుని తెగ తింటుంటారు.
బరువును తగ్గించడంలోనూ, మెదడును చురుగ్గా మార్చడంలోనూ, ఎముకలను దృఢ పరచడంలోనూ, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలోనూ పచ్చి బొప్పాయి చాలా బాగా సహాయ పడుతుంది.కానీ, ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.
అధిక మొత్తంలో పచ్చి బొప్పాయిని తీసుకుంటే మాత్రం అనేక సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.మరి ఇంకెందుకు ఆలస్యం పచ్చి బొప్పాయిని పరిమితికి మించి తీసుకుంటే ఎదురయ్యే నష్టాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
జీర్ణ శక్తిని మెరుగు పరచడంలో పచ్చి బొప్పాయి గ్రేట్గా సహాయ పడుతుంది.అలా అని చెప్పి దానిని ఓవర్గా తింటే జీర్ణ వ్యవస్థ పని తీరు తీవ్రంగా దెబ్బ తింటుంది.
ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
అలాగే పచ్చి బొప్పాయి పపైన్ అనే ఎంజైమ్ను కలిగి ఉంటుంది.
అందు వల్ల, పచ్చి బొప్పాయిని అధిక మొత్తంలో తీసుకున్నప్పుడు వికారం, వాంతులు, మైకం, తీవ్రమైన తల నొప్పి వంటివి ఎదురవుతాయి.
ఆస్తమాతో బాధ పడుతున్న వారు పచ్చి బొప్పాయికి దూరంగా ఉండటమే మేలు.ఎందుకుంటే.దీనిని తీసుకోవడం వల్ల ఆస్తమా లక్షణాలు మరింత తీవ్రతరం అవుతాయి.
అంతే కాదు, పచ్చి బొప్పాయి అతిగా తీసుకుంటే అలర్జీలకు దారి తీస్తుంది.రక్త పోటు స్థాయిలు భారీగా పడిపోతాయి.
మరియు ప్రెగ్నెన్సీ టైమ్లో దీనిని తింటే గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది.కాబట్టి, పచ్చి బొప్పాయిని ఎంత లిమిట్గా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది.
అదే గర్భిణీ స్తీలైతే దాని జోలికే వెళ్లకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.