సినిమాలలో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో ‘వీడొక్కటే’ వంటి సినిమాలలో చూశాం.అయితే నిజ జీవితంలో అంతకు మించి మాదకద్రవ్యాలపెడ్లర్లు ప్లాన్లు వేస్తున్నారు.
చాలా సందర్భాల్లో అనుమానం వచ్చి పరిశీలిస్తే అసలు గుట్టు బయటపడుతుంది.ఇటీవల కాలంలో పార్సిల్ ముసుగులో మాదకద్రవ్యాల రవాణాకు తెరలేపారు.తాజాగా ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వాటర్ ప్యూరిఫైయర్లోని ప్రత్యేక క్యావిటీలో దాచిపెట్టిన సుమారు 4.88 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎన్సిబి అధికారులు వెల్లడించారు.ఆస్ట్రేలియాకు పంపాల్సిన వాటర్ ప్యూరిఫైయర్లో తయారు చేసిన క్యావిటీలో డ్రగ్ కన్సైన్మెంట్ దాగి ఉందని అధికారి తెలిపారు.
ఈ కేసులో కొరియర్ ఏజెంట్, పార్సిల్ పంపిన వ్యక్తిని ఎన్సీబీ పట్టుకుంది.అరెస్టయిన నిందితులను ప్రాథమిక విచారణలో కొరియర్ ఫ్రాంచైజీ యజమాని కూడా మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్నట్లు తేలింది.నిర్దిష్ట సమాచారం అందుకున్న ఎన్సీబీ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది.స్వాధీనం చేసుకున్న అక్రమాస్తుల విలువను ఎన్సీబీ వెల్లడించలేదు.ఆ కొరియర్ ఏజెంట్ పార్శిళ్లను పంపేటప్పుడు ఎవరు పంపుతున్నారో వివరాలు తెలిపే వాడు కాదు.మెయిన్ రిసీవర్ సూచనల మేరకు ఏజెంట్ గతంలో చాలాసార్లు ఇలాంటి పార్శిళ్లను పంపాడు.
కొరియర్ ద్వారా పార్శిల్ను రవాణా చేయడానికి రవాణాదారు నకిలీ గుర్తింపును ఉపయోగించాడు.ఈ నెట్వర్క్ గతంలో ఇలాంటి అనేక రకాల పార్సెల్లను పంపిందని పోలీసులు వెల్లడించారు.
డెలివరీ నెట్వర్క్లో కింగ్పిన్ పొరలను సృష్టించాడని, అధికారి పేర్కొన్నాడు.ఇటీవల కాలంలో డ్రగ్స్ పెడ్లర్లు తెలివి మీరి పోయారని, పార్సిల్ సేవల ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నారని అన్నారు.
కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.