త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ బాక్సాఫీసుని ఓ ఆట ఆడుకుంటోంది.నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల షేర్ రాబట్టింది ఈ చిత్రం.
కాని త్రివిక్రమ్ మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఈ సినిమా కథ యద్దనపూడి సుచోచనరాణి రాసిన మీనా నవల నుంచి తీసుకున్నారన్న సంగతి తెలిసిందే.
తీసుకుంటే తీసుకున్నారు కాని, మొదట సుచోచన రాణికి కృతజ్ఞతలు చెప్పలేదు క్రెడిట్స్ లో.ఈ విషయంపై విమర్శలు ఎక్కువయ్యే సరికి థ్యాంక్స్ కార్డ్ జత చేశారు.
ముందు నుంచి సులోచన గారికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నా, సాంకేతిక కారణాల వలన థ్యాంక్స్ కార్డు 48 గంటలు ఆలస్యం అయ్యిందని త్రివిక్రమ్ చెప్పడం నిజంగా హాస్యాస్పదం.ఎందుకంటే అఆ సెన్సార్ మే ,26న పూర్తయ్యింది.
వారంలో మిగితా పనులన్ని పూర్తి చేశారు కాని, ఒక్క థ్యాంక్స్ కార్డు వేయడానికి మాత్రం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే నిజంగానే నమ్మశక్యంగా లేదు.విమర్శలకు సమాధానమివ్వలేకే రెండు రోజులు తరువాత థ్యాంక్స్ జతచేసి ఉండవచ్చు అని విమర్శకులు భావిస్తున్నారు.
ఈ లెక్కన త్రివిక్రమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ అని అబద్ధమాడినట్టేగా !
.