విజయవాడలోని హోటల్ ఐలాపురం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఇక్కడ ఏపీ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో సెమినార్ జరుగుతోంది.
సోషల్ మీడియా – మహిళలపై దాడి అంశంపై వాసిరెడ్డి పద్మ ఈ సెమినార్ నిర్వహిస్తున్నారు.అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన టీడీపీ మరియు జనసేన మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో తెలుగు మహిళలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది.దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
మహిళల సమస్యలపై పెట్టిన సెమినార్ కు తమను వెళ్లనీయకుండా అడ్డుకోవడంపై తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.